ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 29న ఇటలీ, యూకే దేశాల పర్యటనకు బయలుదేరనున్నారు. ఆ రెండు దేశాల్లో ఈ నెల 29 నుంచి నవంబర్ 2 వరకు ఐదు రోజుల పాటు ఆయన పర్యటన కొనసానుంది. ఇటలీలోని రోమ్ నగరంలో, యునైటెడ్ కింగ్డమ్లోని గ్లాస్గో నగరంలో జరిగే రెండు కీలక సదస్సుల్లో ఆయన పాల్గొననున్నారు.
వాటిలో ఒకటి జీ-20 సదస్సు. ఈనెల 30, 31వ తేదీల్లో రోమ్ లో ఇటలీ ప్రధాని అధ్యక్షతన జరగనున్న జీ-20 దేశాల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ సదస్సులో కరోనా మహమ్మారి విలయం, ఆరోగ్యం విషయాల్లో అంతర్జాతీయ సహకారం, ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించడం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పు తదితర అంశాలే అజెండాగా ఉన్నాయి.
జీ-20 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రభుత్వ అధినేతలు పాల్గొనే ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం 8వ సారి కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 2023లో ఈ సదస్సుకు భారత్ వేదిక కాబోతోంది.
రోమ్ లో జరిగే జీ20 సదస్సు ముగిసిన అనంతరం ప్రధాని మోదీ అక్కడ నుంచి స్కాట్లాండ్ లోని గ్లాస్కోకు బయలుదేరుతారు. అక్కడ ఈనెల 31 నుంచి నవంబర్ 12 వరకు జరగనున్న కాప్ -26 సదస్సుకు ప్రధాని హాజరవుతారు. నవంబర్ 1, 2వ తేదీల్లో జరిగే వరల్డ్ లీడర్స్ సమ్మిట్ రుతో జరిగే ఈ సమావేశంలో పాల్గొంటారు.
ఈ పర్యటనలో ప్రధాని పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇటలీ ప్రధాని మరియో డ్రాగీతో కూడా ప్రధాని సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా గ్లాస్గోలో జరిగే కాప్-26 సదస్సు సందర్భంగా యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ సహా ఇతర దేశాల అధినేలతో ప్రధాని భేటీ కానున్నారు.
More Stories
బీజేపీకి 400 సీట్లు వస్తే మధుర, కాశీలోనూ దేవాలయాలు నిర్మిస్తాం
చాబహార్ పోర్టుపై చిన్న చూపు తగదు .. అమెరికాకు హితవు
సొంత ఇల్లు, కారు, భూమి, షేర్లు లేని ప్రధాని మోదీ