రష్యాలో కరోనా కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం రష్యాలో కొత్తగా 34,303 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 999 మంది చనిపోయారు. సెప్టెంబర్తో పోలిస్తే కేసులు 70 శాతం పెరిగాయి. శనివారం 1,002 మంది కరోనాతో చనిపోయారు. రష్యాలో 14.6 కోట్ల (29%) మంది మాత్రమే వ్యాక్సిన్ వేసుకొన్నారు.
దీంతో ప్రభుత్వం వ్యాక్సిన్ వేసుకొన్న వారికి బోనస్లు, లాటరీలు, నగదు బహుమతులు ప్రకటిస్తున్నది. వ్యాక్సిన్పై సంకోచాలు, అధికారుల్లో సమన్వయం లోపించడం తదితర కారణాల వల్ల వ్యాక్సిన్ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. కరోనా మరణాలు, కేసులు పెరుగుతున్నా మళ్లీ జాతీయ స్థాయిలో లాక్డౌన్ను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు.
దీనికి బదులు ఆయా ప్రాంతాల అధికార యంత్రాంగానికి నిబంధనల అమలుకు సంబంధించి పూర్తి అధికారాలను అప్పగించింది. 85 రీజియన్లలో ప్రజలు బహిరంగంగా పెద్ద ఎత్తున గుమికూడడంపై ఆంక్షలు విధించారు. ధియేటర్లు, రెస్టారెంట్లు, ఇతర వేదికలపై పరిమితి విధించారు.
అయినా మాస్కో, సెయింట్పీటర్స్ బర్గ్, తదితర నగరాల్లో దైనందిన జీవన వ్యవహారాలు యధాదిధిగా సాగుతూనే ఉన్నాయి. మొత్తం మీద 7.99 మిలియన్ నిర్ధారణ కేసులు, 2,23,312 మరణాలను టాస్క్ఫోర్సు నమోదు చేసింది. ఐరోపా మొత్తం మీద ఇక్కడే మరణాల సంఖ్య ఎక్కువ. ప్రపంచం మొత్తం మీద అమెరికా, బ్రెజిల్, భారత్, మెక్సికో తరువాత రష్యాయే మరణాల్లో అయిదో దేశంగా ఉందని అధికారిక రికార్డులు చెబుతున్నాయి.
More Stories
అమెరికా లేకపోతే ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?
ఐరోపా వెళ్లే భారతీయులకు వీసా సులభం
తైవాన్ లో గంటల వ్యవధిలో 80 సార్లు కంపించిన భూమి