జమ్మూ కాశ్మీర్, లడఖ్ మొత్తం – ఈ కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పుడు, ఎప్పటికి భారత్ లో అంతర్గత భాగాలే అని ఐక్యరాజ్యసమితి వేదిక నుండి మరోసారి భారత్ స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల గురించి పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితి ప్రతినిధి సభలో ప్రస్తావించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఐక్యరాజ్య సమితి నిషేధించిన అత్యధిక సంఖ్యలో ఉగ్రవాదులకు ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్ ఒక అజ్ఞాతమైన రికార్డును కలిగి ఉందని పేర్కొంటూ, “ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిషేధించిన ఉగ్రవాదులకు అత్యధిక సంఖ్యలో ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్ అజ్ఞానమైన రికార్డును నెలకొల్పింది. కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో ఆశ్రయం పొందాడు. ఈ రోజు కూడా, పాకిస్తాన్ నాయకత్వం అతడిని అమరవీరుడిగా కీర్తిస్తున్నది” అంటూ భారత్ మొదటి కార్యదర్శి స్నేహ దూబే పొరుగుదేశం కపట వైఖరిని కడిగిపారవేసారు.
పాకిస్తాన్ “ఆయుధాగారం” గా మారువేషంలో ఉంటూ, తన పెరటిలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నందున దాని విధానాల కారణంగా ప్రపంచం మొత్తం నష్టపోతున్నదని ఆమె హెచ్చరించారు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్ సమస్యను లేవనెత్తారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటు పాకిస్తాన్ అనుకూల వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గీలాని మరణంపై భారత ప్రభుత్వం ఆగస్టు 5, 2019 తీసుకున్న నిర్ణయం గురించి ఆయన మాట్లాడారు.
పాక్ ప్రధాని వాఖ్యలకు ఘాటుగా జవాబిస్తూ భారత దేశంలో అవిభాజ్యమైన భాగాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్ లకు సంబంధించి కొన్ని ప్రాంతాలు ఇంకా పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్నాయని స్నేహ దూబే గుర్తు చేశారు. వెంటనే తన ఆక్రమణలో ఉన్న ప్రాంతాలను ఆ దేశం ఖాళీ చేయమని ఆమె డిమాండ్ చేశారు.
“దురదృష్టవశాత్తూ, పాకిస్తాన్ నాయకుడు మా దేశంపై తప్పుడు, హానికరమైన ప్రచారం చేయడానికి ఐక్యరాజ్యసమితి వేదికను దుర్వినియోగం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఉగ్రవాదులు స్వేచ్ఛగా ఆనందించే తన దేశంలోని విషాదకరమైన స్థితి నుండి ప్రపంచ దృష్టిని మరల్చడానికి చేస్తున్న కృషి ఫలించడం లేదు. సాధారణ ప్రజల జీవితాలు, ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన వారి జీవితాలు ఆ దేశంలో తలక్రిందులు అవుతున్నాయి” అంటూ ఈ యువ దౌత్యవేత్త ఎద్దేవా చేశారు.
భారతదేశం పాకిస్తాన్తో సహా మా పొరుగువారందరితో సాధారణ సంబంధాలను కోరుకుంటుందని దుబే స్పష్టం చేశారు. కానీ ఇస్లామాబాద్ విశ్వసనీయమైన, ధృవీకరించదగిన, తిరుగులేని చర్యలు ఈ దిశలో తీసుకోవడం ద్వారా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం కోసం నిజాయితీగా పనిచేయాలని ఆమె హితవు చెప్పారు.
తన ఆధీనంలో ఉన్న భూభాగాన్ని ఏ విధంగా కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించకుండా, భారత్ లో సీమాంతర ఉగ్రవాద చర్యలకు అవకాశం ఇవ్వకుండా తన నిజాయతీని నిరూపించుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, సాయం చేయడం, చురుకుగా మద్దతునివ్వడం అనే నిర్ధారిత చరిత్ర, విధానాన్ని కలిగి ఉందని సభ్య దేశాలకు తెలుసునని ఆమె పేర్కొన్నారు. భద్రతా మండలి గుర్తించిన ఉగ్రవాదులతో అత్యధికులకు ఆతిధ్యం ఇవ్వడం ద్వారా ఆ దేశం రికార్డు సృష్టించిందని ఆమె నిప్పులు చెరిగారు.
“ఇప్పుడు బంగ్లాదేశ్ గా ఉన్న ప్రాంతంలోని వ్యక్తులపై మతపరమైన, సాంస్కృతిక మారణహోమాన్ని అమలు చేసిన నీచమైన రికార్డును కలిగి ఉన్న దేశం ఇది. చరిత్రలో జరిగిన ఈ భయంకరమైన సంఘటనకు ఈ సంవత్సరం మనం 50 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కానీ ఈ మరణహోమంపై జవాబుదారీతనం వహించవలసింది పోయి కనీసం ప్రస్తావన కూడా పాకిస్థాన్ చేయడం లేదు” అంటూ దూబే మండిపడ్డారు.
పాకిస్థాన్లోని మైనారిటీలు-సిక్కులు, హిందువులు, క్రైస్తవులు-నిరంతరం భయంతో జీవిస్తున్నారని, వారి హక్కులను అణచివేయడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తోందని స్నేహ దూబే ఆందోళన వ్యక్తం చేశారు . ప్రతిరోజూ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి, తప్పిపోయిన అదృశ్యాలు, న్యాయవ్యతిరేక హత్యలు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయని ఆమె తెలిపారు.
పాకిస్తాన్ మాదిరిగా కాకుండా, భారతదేశం గణనీయమైన మైనారిటీల జనాభా కలిగిన బహుళవాద ప్రజాస్వామ్య దేశం అని ఆమె గుర్తు చేశారు. భారత్ లో దేశాధ్యక్షుడు, ప్రధాన మంత్రి, ప్రధాన న్యాయమూర్తులు, ఆర్మీ స్టాఫ్ చీఫ్లతో సహా దేశంలో అత్యున్నత పదవులను మైనారిటీలు పొందగలుగుతున్నారని ఆమె పేర్కొన్నారు.
“బహువచనం అనేది పాకిస్తాన్కు అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఇది రాజ్యాంగపరంగా తన మైనారిటీలు రాష్ట్రంలోని ఉన్నత పదవుల కోసం ఆశించకుండా నిషేధించింది. ప్రపంచ వేదికపై తమను తాము ఎగతాళికి గురిచేసే ముందు వారు ఆత్మపరిశీలన చేసుకోవడం చాలా తక్కువ ” అంటూ దుబే పాకిస్థాన్ ధోరణిని అంతర్జాతీయ వేదికపై ధృడంగా కడిగిపారవేసారు.
స్నేహ దూబే మాట్లాడిన తీరు పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె మాట్లాడిన వీడియోలను పోస్టు చేస్తూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. పాకిస్థాన్ వైఖరిని స్నేహ ఎండగట్టిన తీరు అద్భుతమని కొనియాడుతున్నారు. పదునెక్కిన పదాలతో పొరుగు దేశాన్ని చీల్చిచెండాడిన తీరు సూపర్ అని ప్రశంసిస్తున్నారు.
ప్రతి మాటను చాలా జాగ్రత్తగా ఆమె ఎన్నుకున్నట్లు నెటిజెన్స్ అభిప్రాయపడ్డారు. నిజాలను నిర్భయంగా చెప్పిందని మెచ్చుకొంటున్నారు. గతంలోనూ యూఎన్లో భారత్ తరపున మహిళా ప్రతినిధులు ఇలాగే మాట్లాడారు. ఈనమ్ గంభీర్, విదిషా మైత్రా తరహాలోనే స్నేహ కూడా పాక్ భరతం పట్టిందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
More Stories
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు దోషికి జీవిత ఖైదు
అక్రమ వలసదారులను తిప్పి పంపుతా
90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్