టీ20 కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోనున్న విరాట్‌ కోహ్లీ

చాలా రోజుల ఊహాగానాల తర్వాత, విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఐసిసి  పురుషుల టీ 20 ప్రపంచకప్ తర్వాత టీ 20 భారత కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వన్డే,  టెస్ట్ జట్లను పూర్తిగా నడిపించడానికి తనకు సమయం అవసరమని కోహ్లీ తెలిపారు. ఈ విషయానికి సంబంధించి రోహిత్, టీమ్ మేనేజ్‌మెంట్, బీసీసీఐ సుదీర్ఘంగా చర్చించారు. 
 
32 ఏళ్ళ కోహ్లీ తన సోషల్ మీడియాలో ఈ ప్రకటన చేస్తూ ఇలా వ్రాసారు:  “నేను భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా, భారత క్రికెట్ జట్టును నా అత్యుత్తమ సామర్ధ్యంతో నడిపించడం నా అదృష్టం. భారత జట్టు కెప్టెన్‌గా నా ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. తోటి క్రీడాకారులు, ఎంపిక కమిటీ, నా కోచ్, మనం గెలవాలని ప్రార్ధించిన ప్రతి భారతీయుడు  లేకుండా నేను ఏమీ  చేయలేను”.

“పనిభారాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం.  గత 8-9 సంవత్సరాలలో 3 ఫార్మాట్‌లను ఆడుతూ,  గత 5-6 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా కెప్టెన్‌గా నా అపారమైన పనిభారాన్ని పరిగణనలోకి తీసుకుంటే, టెస్ట్, వన్డే క్రికెట్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించడానికి నేను పూర్తిగా సిద్ధంగా ఉండటానికి నాకు కొంత వెసులుబాటు అవసరమని నేను భావిస్తున్నాను.”


“టీ 20 కెప్టెన్‌గా ఉన్న సమయంలో నేను టీమ్‌కు అన్నీ ఇచ్చాను.   టీ 20 టీమ్ కోసం బ్యాట్స్‌మన్‌గా ముందుకు వెళ్తూనే ఉంటాను.” “వాస్తవానికి, నాయకత్వ బృందంలో ముఖ్యభాగమైన రవి భాయ్, రోహిత్ లతో పాటు నా సన్నిహితులతో చాల ఆలోచనలు, చర్చల తర్వాత 
ఈ నిర్ణయానికి రావడానికి చాలా సమయం పట్టింది. నేను అక్టోబర్‌లో దుబాయ్‌లో జరిగే ఈ టీ 20 ప్రపంచకప్ తర్వాత టీ 20 కెప్టెన్‌గా వైదొలగాలని నిర్ణయించుకున్నాను” అంటూ తన ప్రకటనను ముగించారు.

“నేను సెలెక్టర్లతో పాటు బీసీసీఐ కార్యదర్శి జయ్ షా, బిసిసిఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీతో కూడా మాట్లాడాను. నేను నా శక్తి మేరకు భారత క్రికెట్,  భారత జట్టుకు సేవ చేస్తూనే ఉంటాను” అని తెలిపారు. 
అంతకు ముందు కెప్టెన్సీ గురించి విరాట్ స్వయంగా ప్రకటన చేస్తారని అంటూ బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే అతను తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని, ఎప్పటిలాగే ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా మారాలని అభిలాషను వ్యక్తం చేశాయి.

కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా న్యూజిలాండ్‌తో ఓడిపోయిన ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలుచుకోవడానికి చాలా దగ్గరగా వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని మెన్ ఇన్ బ్లూ కింద 2013 లో భారత్ చివరిసారిగా ఐసిసి ట్రోఫీని గెలుచుకుంది. టి 20 ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ టి 20, వన్డే కెప్టెన్సీని వదులుకుంటాడని, అతని నుండి రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరిస్తాడని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్తోసిపుచ్చారు,

భారత క్రికెట్ స్ప్లిట్ కెప్టెన్సీని అమలు చేయడం ఇది మూడోసారి. 2007 లో, అనిల్ కుంబ్లే టెస్ట్ జట్టు కెప్టెన్‌గా ఉండగా, ఎం.ఎస్. ధోని . వన్డే, టీ 20 లకు నాయకత్వం వహించాడు. 2015 లో ధోనీ ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కోహ్లీని టెస్టు జట్టు కెప్టెన్‌గా నియమించారు. ధోనీ 2017 వరకు వన్డే, టీ 20 లకు కెప్టెన్‌గా కొనసాగాడు.

కోహ్లీ 45 టీ 20 ఇంటర్నేషనల్‌లు, 95 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించాడు, అతి తక్కువ ఫార్మాట్‌లో 27, వన్డేల్లో 65 గెలిచాడు. టీ 20 వరల్డ్ కప్ కోసం టీమిండియా మెంటార్‌గా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని నియమించాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ‘స్ప్లిట్ కెప్టెన్సీ’పై నివేదిక అనేక సంచలనాలు రేపింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత, ఐదు ఐసిసి వైట్-బాల్ టోర్నమెంట్‌లలో నాకౌట్ దశలో భారత్ ఓడిపోయింది.

టీ 20 వరల్డ్ కప్ అక్టోబర్ 17 న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్‌లో ప్రారంభమవుతుంది. నవంబర్ 14 వరకు జరుగుతుంది. అక్టోబర్ 24 న ప్రధాన ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారత్ ఆడుతుంది.