ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికాం రంగానికి ఊతమిచ్చే కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రివర్గం తీసుకుంది. 9 నిర్మాణాత్మక సంస్కరణలు, 5 ప్రక్రియ సంబంధిత సంస్కరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక నుంచి స్పెక్ట్రమ్ యూజర్ ఛార్జ్లను హేతుబద్ధీకరించనుండటం కీలక నిర్ణయాల్లో ఒకటి.
అంతేకాకుండా ఇక నుంచి స్పెక్ట్రమ్ను పంచుకోవచ్చు లేదంటే మిగిలిపోయిన స్పెక్ట్రమ్ను తిరిగి అప్పగించవచ్చు. ఇక ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి 100 శాతం ఎఫ్డీలను ఆటోమేటిక్ రూట్లో అనుమతించారు. అంటే టెలికాం రంగంలో ప్రభుత్వ అనుమతి లేకుండానే 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఏర్పడింది.
ఉపశమన ప్యాకేజీలో భాగంగా సర్కారు సర్దుబాటు చేసిన స్థూల రాబడి బకాయిలతో సహా టెలికాం బకాయిలపై నాలుగు సంవత్సరాల మారటోరియంను వర్తింపజేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని వల్ల వేల కోట్ల స్పెక్ట్రమ్ బకాయిలు ఉన్న వొడాఫోన్-ఐడియాలాంటి టెలికం కంపెనీలకు పెద్ద ఊరట కల్పిస్తుందని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నట్లు మంత్రివర్గం తెలిపింది. మారటోరియం పొందినవారు సదరు మొత్తానికి ఎంసీఎల్ఆర్ ప్లస్2 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ‘‘ఈ సంస్కరణలు చాలా విస్తృతమైనవి. అవి నిర్మాణాత్మకమైనవి. ప్రస్తుతం తీసుకునే సంస్కరణలు నేడు, రేపు, భవిష్యత్లో మార్పును తీసుకువస్తాయి’’ అని టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
ఏజీఆర్ హేతుబద్ధీకరణ, భవిష్యత్తు స్పెక్ట్రమ్ వేలంలో పొందే స్పెక్ట్రమ్పై స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జ్లను మాఫీ చేయడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు మంత్రివర్గం తీసుకుంది. భవిష్యత్తు వేలం కోసం స్పెక్ట్రమ్ కాల వ్యవధిని 20 నుంచి 30 ఏళ్లకు పెంచుతున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఒకవేళ స్పెక్ట్రమ్ను మళ్లీ వెనక్కి ఇవ్వాలనుకుంటే మాత్రం 10 ఏళ్ల తర్వాతే సాధ్యమవుతుంది.
ఆటో, ఆటో కాంపోనెంట్స్. డ్రోన్స్ పరిశ్రమల కోసం ఈ పథకాన్ని ఆమోదించినట్లు ప్రకటించారు. ఇది రూ. 26,058 కోట్లు కేటాయిస్తుంది. ఇందులో ఆటో రంగానికి రూ. 25,929 కోట్లు, డ్రోన్ పరిశ్రమ కోసం రూ .120 కోట్లు ఉంటుంది.
ఆటో రంగంపై తీసుకున్న నిర్ణయాల గురించి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, రూ 26,058 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు ఐదు సంవత్సరాలలో పరిశ్రమకు అందించాలని ప్రభుత్వం అంచనా వేసిందని చెప్పారు.
More Stories
ఇరాన్పై క్షిపణులతో ఇజ్రాయిల్ ప్రతీకార దాడి
మణిపూర్లో పోలింగ్ కేంద్రం వద్ద కాల్పుల కలకలం
మనం హిందువులమని గర్వంగా చెప్పుకోగలగాలి