కెల్విన్ తో నగదు లావాదేవీలపై రానాపై ప్రశ్నల వర్షం   

కెల్విన్ తో నగదు లావాదేవీలపై రానాపై ప్రశ్నల వర్షం   
 
‘టాలీవుడ్‌ డ్రగ్స్‌’ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు బుధవారం సినీ నటుడు దగ్గుబాటి రానాను ఏడున్నర గంటలసేపు ప్రశ్నించారు. ముఖ్యంగా డ్రగ్ వ్యాపారి, ప్రధాన నిందితుడు కెల్విన్ తో జరిపిన నగదు లావాదేవీలపైననే విచారణ జరిగిన్నట్లు తెలుస్తున్నది. ఈడీ అధికారులకు కెల్విన్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే రానా విచారణ జరిగినట్లు తెలిసింది. డ్రగ్స్‌ కేసులో తెలంగాణ ఎక్సైజ్‌ విభాగానికి చెందిన సిట్‌ దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.  
 
 ‘‘కెల్విన్‌ మాస్కెరాన్స్‌ ఎవరో తెలియదా!? అయితే.. మీ ఇద్దరి మధ్యలో ఈ ఆర్థిక లావాదేవిలేమిటి? అనుమానాస్పద లావాదేవీలపై వివరణ ఇవ్వండి?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కెల్విన్‌ తో ఆర్థిక లావాదేవీలపై రానాను పదే పదే ప్రశ్నించగా అతడోవరో తనకు తెలియదని రానా సమాధానం చెప్పినట్లుగా తెలిసింది.
మంగళవారం నటుడు నందు విచారణ సందర్భంగా కెల్విన్‌ను తీసుకొచ్చిన అధికారులు.. బుధవారం కూడా ఆయనను ఈడీ కార్యాలయానికి రప్పించారు. అతడి ల్యాప్‌టాప్‌ను తెరిపించి అందులోంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. రానా, కెల్విన్‌లను విడివిడిగా, ఆపై ఇద్దరినీ కలిపి ఈడీ బృందం ప్రశ్నిం చింది. ఇరువురూ చెప్పిన అంశాల్లో కొన్నింటిని క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసింది. రానా తన వెంట రెండు బ్యాంకు ఖాతాలకు సంబందించిన స్టేట్‌మెంట్లు తెచ్చారు. 2015–17 మధ్య లావాదేవీల వివరాలను ఈడీకి ఇచ్చారు.
 సినిమా షూటింగ్‌ల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు జరిగిన లావాదేవీలపైనా రానాను ఆరా తీశారు. 2017లో ఎక్సైజ్‌ అధికారులు విచారించిన సినీ ప్రముఖుల జాబితాలో రానా పేరు లేదు. 2016లో నవదీ్‌పకు చెందిన ఫిలింనగర్‌లోని ఎఫ్‌-క్లబ్‌లో నిర్వహించిన ఒక పార్టీలో రానా పాల్గొన్నారని, ఆ సమయంలోనే కెల్విన్‌తో పరిచయం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. 
2017లో ఎఫ్‌–క్లబ్‌లో జరిగిన పార్టీకి హాజరయ్యారా? దాని ముందు, ఆ తర్వాత కెల్విన్‌కు నగదు బదిలీ చేశారా? తదితర అంశాలపై రానాను ప్రశ్నించారు. ఇంతకు ముందే కెల్విన్‌ బ్యాంక్‌ ఖాతా వివరాలు సేకరించిన అధికారులు అం దులో రానా ఖాతా నుంచి డబ్బు బదిలీ అయినట్లు గుర్తించారని సమాచారం. ఈవెంట్‌ మేనేజర్‌ అయిన కెల్విన్‌తో తాను చేసిన లావాదేవీలన్నీ సినీ రంగానికి సంబంధించినవే అని ఈడీ అధికారులకు రానా స్పష్టం చేసినట్లు తెలి సింది. రానా సాయంత్రం 6 గంటలకు ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోగా, ఆ తర్వాత 2 గంటల పాటు కెల్విన్‌ విచారణ సాగింది.