ఆంధ్రప్రదేశ్లో వినాయక ఉత్సవాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ప్రైవేటు స్థలాల్లో మాత్రమే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
వినాయక చవితి ఉత్సవాలపై దాఖలైన లంచ్మోషన్ పిటిషిన్పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. నిబంధనలు పాటిస్తూ వినాయక పూజలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేటు స్థలాల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఆర్టికల్ 26తో ప్రజలకు మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు అధికారం ఉంటుందని, నిరోధించే హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా నిబంధనల మేరకు పూజలు చేసుకోవాలని ప్రజలకు సూచించింది. ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు నిర్వహించుకోవచ్చునని వెల్లడించింది.
మరోవైపు పబ్లిక్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించింది. ప్రైవేటు స్థలాల్లో కేవలం విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని ఆదేశాలిచ్చింది.
కాగా, హిందూ దేవుళ్లపై వైసీపీ ప్రభుత్వం తీవ్రమైన వివక్ష చూపుతోందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. వర్ధంతులకు, ఉత్సవాలకు లేని అడ్డంకులు వినాయక చవితి పూజలకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. చవితికి ప్రభుత్వం వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని, ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని కన్నా ఆందోళన వ్యక్తం చేశారు.
More Stories
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం
ఏపీలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సీఆర్పీఎఫ్ బలగాలు
7, 8 తేదీల్లో ప్రధాని మోదీ ఏపీలో పర్యటన