“నా ఇంటి ముందు వచ్చిన శివ సైనికులను పోలీసులు స్వాగతించారు. గత రెండు సంవత్సరాలలో కొంకణ్ ప్రాంతానికి శివసేన ఏమి ఇచ్చింది? వారు నాపై చర్య తీసుకుంటే నేను భయపడతానని వారు అనుకున్నారు. కానీ మా ప్రయాణం విజయవంతమైంది,” అంటూ పేర్కొన్నారు.
సంజయ్ రౌత్ ఎలాంటి అర్ధం లేకుండా మాట్లాడుతాడని పేర్కొంటూ వినాయక్, సంజయ్ రౌత్ శివసేన పతనానికి దారి తీస్తారని స్పష్టం చేశారు. కొంకణ్, కాశ్మీర్ మధ్య వ్యత్యాసం మమతా బెనర్జీని ప్రధాన మంత్రి చేయడం వంటిదని ఎద్దేవా చేశారు.శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఘర్షణలో చిక్కుకున్న నారాయణ్ రాణే, ఆ పార్టీ, దాని నాయకుల గురించి తనకు చాలా విషయాలు తెలుసునని గుర్తు చేశారు. వాటిని “దశలవారీగా” బయటపెడతానని చెప్పారు. ఎవరి పేరు ప్రస్తావించకుండా సోదరుడి భార్యపై యాసిడ్ వేయమని ఎవరు అడిగారో తనకు తెలుసని చెప్పారు.
ఈ వారం ప్రారంభంలో, ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా చేసిన వాఖ్యలు ఇది వివాదానికి దారితీశాయి. మంగళవారం మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయగా, ఆ రాత్రి మెజిస్ట్రేట్ బెయిల్ పై విడుదల చేశారు. ఈ సంఘటన రాష్ట్రంలో శివసేన, బిజెపి మద్దతుదారుల మధ్య ఘర్షణలకు దారితీసింది.
“నేను వారితో (శివసేనతో) 39 సంవత్సరాలు పనిచేశాను, నాకు చాలా విషయాలు తెలుసు. తన సొంత సోదరుడి భార్యపై యాసిడ్ వేయమని ఎవరు అడిగారో నాకు తెలుసు. అది ఎలాంటి ‘సంస్కారం’?” అంటూ కేంద్ర మంత్రి ప్రశ్నించారు. శివసేన అధ్యక్షుడు కూడా అయిన ఉద్ధవ్ ఠాక్రేని పరోక్షంగా ప్రస్తావిస్తూ “ఒక కేంద్ర మంత్రిని అరెస్టు చేయడం ద్వారా ఒకరు ఏమి సాధించారు?” అని ప్రశ్నించారు.
శివసేన కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాణే 1999 లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, 2005 లో, “పార్టీ వ్యతిరేక కార్యకలాపాల” ఆరోపణపైసేన నుండి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి 2017 వరకు అక్కడే ఉన్నారు.
కాంగ్రెస్ నుండి నిష్క్రమించిన తరువాత, 2017 అక్టోబర్లో మహారాష్ట్ర స్వాభిమాన్ పక్షాన్ని ప్రారంభించారు. 2018 లో బిజెపికి మద్దతు ప్రకటించి, ఆ పార్టీ నామినేషన్పై రాజ్యసభకు ఎన్నికయ్యాడు. అక్టోబర్ 2019 లో, ఆయన తన పార్టీని బిజెపిలో విలీనం చేశారు.
గత నెలలో జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయన మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఇ) మంత్రి అయ్యారు.
More Stories
దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీ రావాలి
అమేథిలో రాహుల్, రాయ్బరేలీలో ప్రియాంక పోటీ?
ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్’