ఈ కేసులో భాస్కర్రెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నారు. వివేకా కుమార్తె సునీత ఇచ్చిన 15మంది అనుమానితుల లిస్టులో కూడా భాస్కర్ రెడ్డి పేరు మొదటగా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో సీసీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని మొదటి సారిగా పిలిపించారు. వివేకా హత్య వెనుక ఏఏ కారణాలు ఉన్నాయని అధికారులు విచారిస్తున్నారు. అలాగే రాజకీయ వివాదాలు, ఆర్థిక లావాదేవీలపై భాస్కర్ రెడ్డిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే కడప సెంట్రల్ జైల్ గెస్ట్హౌస్ కేంద్రంగా ఉమాశంకర్రెడ్డి, సునీల్ యాదవ్ సమీప బంధువు భరత్లను మరో బృందం విచారించింది. సునీల్కు నార్కో అనాలసిస్ పరీక్షల కోసం అనుమతి కోరుతూ పులివెందుల ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ వేసినట్లు తెలిసింది.
మరోవైపు వివేకా హత్య కేసులో కీలక నిందితుడు సునీల్ యాదవ్ ను ఇప్పటికే సీబీఐ అధికారులు పది రోజుల పాటు విచారించారు. కస్టడీ ముగియడంతో అతన్ని కడప కేంద్ర కారాగారం నుంచి పులివెందులకి తీసుకెళ్ళి, పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. పలు వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. పదిరోజుల విచారణలో సీబీఐ కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
More Stories
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సందేహాలపై కేంద్ర మంత్రి ఆగ్రహం
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఆగ్రహం