నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాద స్థావరాల్లో సుమారు 140 మంది ఉగ్రవాదులు ఉన్నారని, వీరంతా జమ్మూ-కశ్మీరులో చొరబడేందుకు అనువైన సమయం కోసం వేచి చూస్తున్నారని భద్రతా దళాలకు చెందిన అధికారి ఒకరు చెప్పారు.
భారత్, పాకిస్థాన్లు గత ఫిబ్రవరిలో కాల్పులవిరమణకు అంగీకరించినప్పటికీ అధీన రేఖ వెంబడి ఉగ్వాద ఉగ్రవాద శిక్షణా స్థావరాలు ఇప్పటికీ యధావిధిగా కొనసాగుతున్నాయని గుర్తించారు. ల్పుల విరమణ ఒప్పందం భారత్కంటే పాకిస్థ్థాన్కు చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
ఎందుకంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్(ఎఫ్ఎటిఎఫ్) గ్రే లిస్టు జాబితా నుంచి బైటపడడానికి అది ప్రయత్నిస్తోందని గుర్తు చేశారు. పాకిస్థాన్ గనుక సనిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలను గనుక తొలగిస్తే దాని నిజాయితీని అంచనా వేయడానికి వీలవుతుందని తెలిపారు.
అయితే జమ్మూ, కశ్మీర్లోకి చొరబడడం కోసం అధీన రేఖ వెంబడి లాంచ్ప్యాడ్ల వద్ద దాదాపు 140 మంది ఉగ్రవాదులు ఉన్న విషయాన్ని సైన్యం గమనిస్తూనే ఉందని, పటిష్ఠమైన చొరబాట్ల నిరోధక భద్రతా వ్యవస్థ కారణంగా వారు ఆ సాహసం చేయలేకపోతున్నారని ఆయన చెప్పారు. జమ్మూ, కశ్మీర్లోకి చొరబడడానికి గతంలో వారు ప్రయత్నించగా, అప్రమత్తంగా ఉన్న మన జవాన్లు వారి కుటిల యత్నాలను భగ్నం చేయడంతో వెనుదిరిగారని ఆ అధికారి చెప్పారు.
గత ఏడాది అధీన రేఖ వెంబడి పౌర నివాస ప్రాంతాలపై పాక్ సైన్యాల కాల్పులు, శతఘ్ని దాడుల కారణంగా మన సైన్యం జరిపిన దాడుల్లో ధ్వంసమైన తమ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకోవడానికి సాక్ కాల్పుల విరమణను ఒక అవకాశంగా ఉపయోగించుకుంటోందని ఆయన చెప్పారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయడం పాకిస్థాన్కు చాలా ముఖ్యమని చెప్పారు. చొరబాట్లను నిరోధించే వ్యవస్థ మన దేశంలో పటిష్టంగా ఉండటం వల్ల ఎల్ఓసీ వద్ద వేచి ఉన్న సుమారు 140 మంది ఉగ్రవాదులు కశ్మీరులో చొరబడలేకపోతున్నట్లు తెలిపారు. కశ్మీరులో చొరబడేందుకు ఈ ఉగ్రవాదులు ఇటీవల చేసిన ప్రయత్నాలను భారతీయ దళాలు విజయవంతంగా తిప్పికొట్టడంతో, వారంతా తిరిగి పాకిస్థాన్వైపు వెళ్ళిపోయారని పేర్కొన్నారు.
రెండేళ్ల క్రితం కేంద్రం జమ్మూ, కశ్మీర్కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితిపై మాట్లాడుతూ, ఒక్కసారిగా విదేశీ ఉగ్రవాదులు మాయమైపోయారని, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కానీ, సహజ గుహలు ఉండే ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో కానీ దాక్కొని ఉండవచ్చని ఆ అధికారి చెప్పారు.
కాగా స్థానికులు ఉగ్రవాద సంస్థల్లో చేరడం గురించి మాట్లాడుతూ, ఆయుధాలు ధరించడం లేదా, దేశానికి వ్యతిరేకంగా కుట్రపూరిత కార్యకలాపాల్లో పాల్గొనాలనే ఉద్దేశం ఉన్న వారు అలాంటి ఆలోచనలు మానుకోవాలని హితవు చెప్పారు. అలాంటి వారిని ఉక్కుపాదంతో అణచి వేస్తామనే సందేశాన్ని నిరంతరం ఇస్తూనే ఉన్నామని కూడా ఆ అధికారి స్పష్టం చేశారు.
More Stories
రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం