చర్చ్ లో 10 మంది యువతులతో అర్థరాత్రి పాస్టర్!

చర్చ్ ఓ పవిత్ర ప్రార్ధనా స్థలం. ఎంతోమంది భక్తులు ప్రశాంతంగా ఉండాలని వచ్చే చోటు. కానీ, ఆ చర్చ్ లో మాత్రం జరిగేవి ప్రార్థనలు కావు. కామ క్రీడలు. చేయించేది ఎవరో కాదు ఒక పాస్టర్. పవిత్రమైన చర్చ్ లో  పాస్టర్ అనే ముసుగు వేసుకొని వ్యభిచార గృహం నెడుతున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన  తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో వెలుగుచూసింది.

కన్యాకుమారి జిల్లా ఎస్టీ మంగడుకు చెందిన లాల్ షైన్ సింగ్(40) పాస్టర్ గా పని చేస్తున్నాడు.  అదే ప్రాంతంలోని తన లగ్జరీ బంగ్లాలో ‘ఫెడరల్ చర్చ్ ఆఫ్ ఇండియా’ అనే పేరుతో చర్చిన నడుపు తున్నాడు. ఇది కన్యాకుమారిలో ఉన్న పేరున్న చర్చిలలలో ఒకటిగా ఉంది. నిత్యం ప్రార్థనలు, భక్తులతో కళకళ లాడుతూ ఉండేది. ఇదంతా ఒక వైపు మాత్రమే.  ఇంకోవైపు ఆ లగ్జరీ బంగ్లా ఎంతోమంది ప్రముఖులకు పడక సుఖాన్ని అందించే స్వర్గధామం.

ఒక పక్క పాస్టర్ గా నీతులు చెప్తూనే, మరోపక్క పాడుపనులు చేయడానికి అలవాటు పడ్డాడు లాల్ షైన్ సింగ్. కేరళతోపాటుగా ఇతర రాష్ట్రాల నుంచి హిందూ దళిత, క్రిస్టియన్స్ ముసుగులో అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. అర్ధరాత్రులు చర్చ్ వద్ద అమ్మాయిలు, కార్లు రావడం, పోవడం గమనించిన స్థానికులు ఆ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. చర్చ్ లో వ్యభిచారం జరుగుతుందని పక్క సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ లు నిర్వహించారు. దీంతో వారి గుట్టు రట్టయ్యింది.

దాదాపు 15 మంది వరకు పోలీసులు చర్చి పేరుతో ఉన్న లగ్జరీ బంగ్లాపై దాడి చేశారు. ఆ సమయంలో బంగ్లాలోని వేర్వేరు గదుల్లో శృంగారం చేస్తున్న మహిళలు, పురుషులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు యువతులతో సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఇందులో ఓ 19 ఏళ్ల యువతిని ఆమె తల్లే వ్యభిచార కూపంలోకి నెట్టిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. నీతిరవిలై  పోలీస్ స్టేషన్ లో పాస్టర్ తో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు.