హుజురాబాద్లో తనకు ఓటేస్తే.. పథకాలు ఎందుకు ఇవ్వరని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఇదేమైన వాళ్ళ తాత జాగీరా.. వాళ్ల ఇంట్లో నుంచి ఇస్తున్నారా డబ్బులు అంటూ నిలదీశారు. దుబ్బాక, కరీంనగర్, మల్కాజిగిరిలో ప్రభుత్వ పథకాలు ఇవ్వడం లేదా అని అడిగారు.
మహిళా ఎంపీడీవోను ఉద్దేశించి మంత్రి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలను ఈటల తప్పుబట్టారు. ‘‘మంత్రి అలా అనొచ్చా. ముఖ్యమంత్రి దీనిపై స్పందించాలి. మంత్రులు కల్లు తగిన కోతుల్లాగా ప్రవర్తిస్తున్నారు. మంత్రులకు మతి భ్రమించింది.. సీఎం ఆదేశాలతో ఏమైనా అంటున్నారా’’ అని ఈటల విస్మయం వ్యక్తం చేసారు.
ఇదిలా ఉంటే, హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రకు ఈటల రాజేందర్ సిద్ధమయ్యారని తెలుస్తున్నది. రెండు, మూడు రోజుల్లో మొదలుపెట్టే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. కమలాపూర్ మండలం బత్తినివానిపల్లె నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ వారే
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు