వ్యాక్సినేషన్ డ్రైవ్లో టీకాల లబ్ధిదార్ల పేర్ల నమోదుకు భారత్ రూపొందించిన కొవిన్ యాప్ వ్యవస్థపై దాదాపు 50 దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని, ఈమేరకు ఆయా దేశాలకు ఉచితంగా సాఫ్ట్వేర్ అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని కొవిడ్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఎంపవర్డ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ శర్శ వెల్లడించారు.
ఈ వ్యవస్థను ఏ దేశం కోరినా ఉచితంగా సాఫ్ట్వేర్ అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారని ఆయన చెప్పారు. ఈ కొవిన్ ప్లాట్ఫారమ్ చాలా పేరుపొందిందని, కెనడా, మెక్సికో, నైజీరియా,పనామా, తదితర సెంట్రల్ ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాకు చెందిన 50 దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని ఆయన వివరించారు.
భారత పరిశ్రమల సమాఖ్య (కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో జరిగిన రెండో ప్రజారోగ్య సదస్సు 2021 లో ఆయన ఈ వివరాలు తెలియచేశారు. ‘దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టతకు అభివృద్ది చెందుతున్న అత్యవసరాలు’ అన్న అంశంపై ఈ సదస్సు నిర్వహించారు.
కొవిన్ పోర్టల్కు సంబంధించిన ఓపెన్సోర్స్ సాఫ్ట్వేర్ను ఆయాదేశాలతో ఉచితంగా పంచుకోవటానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. 130 కోట్ల మంది దేశప్రజలకు టీకాలు వేయటమనేది చిన్న విషయం కాదని, ఈ బృహత్తర కార్యంలో కొవిన్ పాత్ర కీలకమని పేర్కొన్నారు. కొవిన్ వంటి డిజిటల్ వేదికలను సొంతంగా తయారుచేయటం ద్వారా భారత్ శక్తిసామర్థ్యాలు ఏమిటో వెల్లడయ్యాయని శర్మ తెలిపారు.
వచ్చే నెల 5న ఆరోగ్య, టెక్నాలజీ నిపుణులతో ప్రపంచస్థాయి సదస్సు వర్చువల్గా జరుగనుందని.. దీంట్లో కొవిన్ ఎలా పని చేస్తుందో తెలియజేయటంతోపాటు, దానికి సంబంధించిన ఓపెన్సోర్స్ సాఫ్ట్వేర్ను ఉచితంగా అందజేయనున్నట్లు ప్రకటిస్తామని వెల్లడించారు.
ప్రపంచం లోని ఆరోగ్య, సాంకేతిక నిపుణులతో జులై 5న నిర్వహించనున్న సదస్సులో ఈ కొవిన్ వ్యవస్థ పనిచేస్తుందో వివరాలు పంచుకోవడమౌతుందని ఆయన పేర్కొన్నారు. ఆయా దేశాల్లో కొవిన్ వ్యసస్థను అమలు చేయడానికి వియత్నాం, ఇరాక్, డొమినికన్ రిపబ్లిక్, అరబ్ ఎమిరేట్స్, ఆసక్తి చూపించాయని వివరించారు. ఐదు నెలల్లో 30 కోట్ల టీకా లబ్ధిదారుల రిజిస్ట్రేషన్లు, వ్యాక్సినేషన్లను నిర్వహించే స్థాయికి కొవిన్ చేరుకుందని చెప్పారు.
More Stories
రష్యన్ వ్యూహాత్మక బాంబర్ను కూల్చేసిన యుక్రెయిన్
టెల్ అవీవ్, దుబాయ్లకు ఎయిరిండియా విమానాలు రద్దు
ఇరాన్పై క్షిపణులతో ఇజ్రాయిల్ ప్రతీకార దాడి