తెలంగాణలో ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమం

తెలంగాణలో ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమం మొదలైందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ ప్రకటించారు.  హుజురాబాద్ ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకనని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లాలోని షామీర్‌పేట్‌లోని తన నివాసంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరిచంద్ర రెడ్డితో కలిసి సమావేశమైన సందర్భంగా హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రజలు తమ సొంత ఎన్నికగా భావిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రతి వ్యక్తి తామే ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు ఎన్నిక ఉండబోతోందని చెప్పారు. ఉద్యమంలో హుజూరాబాద్ నియోజకవర్గం స్పూర్తిని నింపిందని తెలిపారు. బీజేపీలో చేరటం గర్వంగా ఫీలవుతున్నానని పేర్కొంటూ 2024లో తెలంగాణలో ఎగిరే జండా కాషాయం జెండా అని ఈటల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమంలో తాము లేకుంటే కెప్టెన్ ఎక్కడుండేవాడని పరోక్షంగా కేసీఆర్ ను ప్రస్తావిస్తూ   రాజేందర్‌ ప్రశ్నించారు.

ఆదేశాలను తాము సమర్థవంతంగా అమలు చేయకుంటే.. పేరు, గుర్తింపు కెప్టెన్‌ వచ్చేవి కావని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ పాలనపై ప్రజలు అసహ్యం వ్యక్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కొత్త రాష్ట్రంలో ఇన్ని బాధలు ఉంటాయని తెలంగాణ సమాజం ఊహించి ఉండదని తెలిపారు. గడ్డిపోస కూడా ఇప్పుడు అవసరపడుతుందని చెబుతూ  ప్రజల ఆశీర్వాదం ఉంటేనే రాజకీయ నాయకునికి బతుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

తను ఉద్యమంలో ప్రజల కాళ్ళ మధ్యలో తిరిగిన వ్యక్తిని అని, సుష్మా స్వరాజ్, విద్యాసాగరరావు లాంటి నేతలతో ఉద్యమంలో కలసి పనిచేశానని వెల్లడించారు. ‘నా డీఎన్‌ఏను పక్కన పెడితే.. మరో ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కావాలి. చరిత్ర మెదలు వావటానికి ఏదొక పార్టీ తోడు ఉండాలి కాబట్టే టీఆర్ఎస్‌లో పనిచేశాను’ అని  తెలిపారు.

`నా ఇల్లు మేడ్చల్‌లోనే ఉంది. వాళ్ల కళ్ళలో మెదిలిన బిడ్డను నేను. మీకు నిత్యం అందుబాటులో ఉంటాను. నేను నిప్పులాగా పెరిగిన బిడ్డను. భూమి గుంజుకున్న లోంగిపోలేదు’ అని స్పీష్టమ్ చేశారు.

కానీ ఇప్పుడు చట్టం కొంతమందికే పని చేస్తుందని విమర్శించారు. ఈ ప్రభుత్వం కొనసాగితే తెలంగాణ ప్రజలకు అరిష్టం అని రాజేందర్ హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని దించే వరకు నిద్రపోవద్దు అని సమాజం అంతా అనుకుంటుందని చెప్పారు. గుణపాఠం చెప్పాలి. అహంకారానికి ఘోరీ కట్టాలని పిలుపిచ్చారు.