అంతరాష్ట్ర సరిహద్దుల నుంచి వస్తున్న అంబులెన్స్లను ఎందుకు అవుతున్నారని కేసీఆర్ సర్కార్పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్టాల నుంచి అంబులెన్స్లో వస్తున్న వారికి టెస్టులు చేయమని మాత్రమే చెప్పామని, వారిని ఆపమని మీకు ఎవరు చెప్పారంటూ హైకోర్టు ఫైర్ అయింది.
అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్స్ ఆపమని ఎవరు చెప్పారు? ఈ సమయంలో అంబులెన్స్లు ఆపడం మానవత్వమా? అంబులెన్స్ రేటులను నియంత్రించాలని చెప్పాం.. చేశారా? అంటూ రాష్ట్రంలో జరుగుతున్న వాటికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డిలలో కేసులు తగ్గాయని ఎలా చెపుతున్నారని ప్రశ్నించింది. టెస్టులు తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెపుతారంటూ మండిపడింది. పాతబస్తి ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల మీద గుంపులు గుంపులుగా తిరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇచ్చేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకూ ఏజీ సమయం కోరారు.
గత విచారణలో ఎక్స్పర్ట్ కమిటీ వేయమని చెప్పాం వేశారా? అని హైకోర్టు ప్రశ్నించింది. పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ‘ కుంభ మేళా నుంచి తిరిగి వచ్చిన వారిని గుర్తించి టెస్ట్లు చేయాలని చెప్పాం చేశారా? అంటూ నీలదీసింది.
పాతబస్తీ వంటి ప్రాంతాల్లో మత పరమైన కార్యక్రమాలను ఎందుకు నియంత్రించడం లేదు? రంజాన్ తరువాత లాక్డౌన్ పెడతారా? ఈ లోపే వైరస్ విజృంభిస్తుంది కదా? మేం ఆదేశాలు ఇచ్చిన రోజు హుటాహుటిన ప్రెస్ మీట్ లు పెట్టి పరిస్థితి అంతా బాగుంది లాక్డౌన్ అవసరం లేదని ఎలా చెప్తారు? అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది.
“యాక్టివ్ కేసులు ఎందుకు తగ్గుతున్నాయి? మేం టెస్ట్ల సంఖ్య పెంచాలని చెబితే అందుకు భిన్నంగా తగ్గించారు – హై కోర్టు అంటే మీ ప్రభుత్వానికి లెక్క లేదా?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది.
More Stories
నిశ్శబ్ద విప్లవ ఫలితం జూన్ 4న తెలుస్తుంది
తెలంగాణాలో రెండంకెల సీట్లు.. కిషన్ రెడ్డి ధీమా
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి మాధవీలతపై కేసు నమోదు