తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన (ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర ఖజగమ్) ఏఐఏడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
దాంతో ఇక నుంచి ఆయన తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు. ‘‘ఎడప్పాడి పళని స్వామి శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన ఎమ్మెల్యేలు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.’’ అని పార్టీ పేర్కొంది. పార్టీ శాసనసభా పక్ష నేతగా పళని స్వామి ఎన్నికయ్యారని పార్టీ సీనియర్లైన సెంగొట్టియన్, శ్రీనివాసన్, మును స్వామి, తంగమణి తదితరులు స్పీకర్కు ఓ లేఖ అందజేశారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకుగాను ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 160 స్థానాల్లో విజయం సాధించింది. గత పదేండ్లుగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఈ ఎన్నికల్లో కేవలం 72 స్థానాలకు పరిమితమైంది. దాంతో ఇన్నాళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన స్టాలిన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగా, గత నాలుగున్నరేండ్ల నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసిన పళనిస్వామి ఇప్పుడు ప్రతిపక్ష నేత అయ్యారు.

More Stories
యాసిన్ మాలిక్ భార్యకు విడాకులు.. నర్సు హత్య కేసులో మరణశిక్షకు సిద్ధం
లా విద్యార్ధులపై చర్యలు తీసుకొనే అధికారం బార్ కౌన్సిల్ కు లేదు
చేనేత, పట్టు రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి .. బిఎంఎస్