ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ను ఈ నెల 17 వరకు పొడగించారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. మే 14 న పంచాయతీ ఎన్నికలు, అనంతరం రంజాన్ పండుగ తర్వాత గ్రామాల్లో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు లాక్డౌన్ను పొడగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
తొలుత ఏప్రిల్ 29 న వారాంతపు బంద్ చేపట్టారు. తర్వాత దానిని మే 4, మే 6 వరకు, ఆ తర్వాత మే 10 వరకు పొడగించారు. ఇప్పుడు యోగి ప్రభుత్వం మళ్ళీ కరోనా కర్ఫ్యూను మే 17 న ఉదయం 7 గంటల వరకు పొడిగించింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ టీం -9 తో ఆదివారం జరిపిన సమీక్ష సమావేశంలో లాక్డౌన్ కొనసాగించాలని నిర్ణయించారు. కరోనా ఇన్ఫెక్షన్ చైన్ను విచ్ఛిన్నం చేయడానికి కరోనా కర్ఫ్యూను మరోసారి మే 17 న ఉదయం ఏడు గంటల వరకు పొడిగించారు. ఈ సమయంలో అన్ని ఆంక్షలు మునుపటిలాగే అమలులో ఉంటాయని, అవసరమైన సేవలకు మినహాయింపు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
More Stories
పూంచ్లో ఉగ్రవాదుల కోసం భారీగా గాలింపు
జమ్మూకాశ్మీర్లో భారీ ఉగ్రదాడి.. ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై కాల్పులు
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా