
గత సంవత్సరం కోవిడ్ మహమ్మారి కాలంలో రాష్ట్రస్థాయిలో మూలధన వ్యయానికి ఇది సహాయపడింది. ఈ పథకానికి వచ్చిన సానుకూల స్పందనను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ పథకాన్ని 2021–22 సంవత్సరానికి కూడా కొనసాగించాలని నిర్ణయించింది.
ప్రత్యేక సహాయ పథకం కింద మూడు విభాగాలు ఉన్నాయి. మొదటి విభాగం ఈశాన్య, కొండప్రాంత రాష్ట్రాలకు సంబంధించినది. ఈ విభాగానికి రూ. 2,600 కోట్ల రూపాయలు కేటాయించారు. రెండో విభాగంలోని రాష్ట్రాల కోసం రూ. 7,400 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మొత్తాన్ని 15వ ఆర్థిక సంఘం అవార్డు మేరకు కేంద్రపన్నులలో వాటి దామాషా ప్రకారం కేటాయిస్తారు.
మూడో విభాగం కింద రాష్ట్రాలకు మానిటైజేషన్, మౌలిక సదుపాయాల ఆస్తుల రీసైక్లింగ్, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ (ఎస్పీఎస్ఈసీ)ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు ప్రోత్సాహకం అందజేస్తారు. ఈ విభాగం కింద ఈ పథకానికి రూ.5 వేల కోట్లు కేటాయించారు.
రాష్ట్రాలు అసెట్ మానిటైజేషన్, లిస్టింగ్, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమకూర్చుకున్న దానిలో 33 శాతం నుంచి 100 శాతం వరకు మొత్తాన్ని 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణంగా పొందుతాయి.
ఇలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం శనివారం రాష్ట్రాలకు రూ.8,873.6 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇందులో ఆయా రాష్ట్రాలకు చేరే మొత్తంలో 50 శాతం నిధులను కరోనా నివారణ చర్యలకు వాడుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఈ సారి ఎస్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం ముందుగానే విడుదల చేసింది.
సాధారణంగా ఫైనాన్స్ కమిషన్ సిఫారసు మేరకు జూన్లో కేంద్రం విడుదలవుతాయి. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు అందించిన మొత్తానికి సంబంధించిన వినియోగ ధ్రువీకరణపత్రం కోసం చూడకుండా.. 22 రాష్ట్రాలకు ఈ నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇందులో 50శాతం అంటే రూ.4,436.8 కోట్లను కరోనా కట్టడికి రాష్ట్రాలు వినియోగించుకోవచ్చు.
ఆసుపత్రుల్లో వెంటిలెటర్లు, ఎయిర్ ప్యూరీఫైయర్లు, అంబులెన్స్ సేవల బలోపేతం, కొవిడ్ ఆసుపత్రులు, కేర్ సెంటర్లలో ఆక్సిజన్ ఉత్పత్తి, నిల్వ ప్లాంట్ల ఖర్చులు తదితర అవసరాలకు వినియోగించుకోవచ్చని ఆర్థికశాఖ పేర్కొంది.
More Stories
భారత్ లో ఓటింగ్ను పెంచేందుకు అమెరికా నిధులు?
లడ్డూ కల్తీ నెయ్యి సూత్రధారుల కోసం ఇక వేట
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత