జగన్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. నరేగా పనులకు బిల్లులు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సరైన జవాబు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
రాష్ట్రంలో 2018 నుంచి 2019 వరకు నరేగా పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించడం లేదంటూ న్యాయవాదులు వీరారెడ్డి, ప్రణతి, నర్రా శ్రీనివాస్ పిటిషన్లు వేశారు. దీనిపై సుమారు ఏడాది కాలంగా విచారణ జరుగుతోంది.
2018 నుంచి 2019 వరకు ఎన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయి? ఎంత మొత్తం చెల్లించాలో కోర్టుకు నివేదించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. దీనికి సమాధానంగా కేంద్రం నుంచి డబ్బులు రాలేదని ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్పారు. ఆ సమాధానంతో న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. 2018 నుంచి 2019 వరకు రాకపోతే ఆ తర్వాత సంవత్సరాలకు బిల్లులు ఎలా వచ్చాయని కోర్టు ప్రశ్నించింది.
పైగా రూ. 5 లక్షల లోపు ఉన్న బిల్లులకు 20 శాతం తగ్గించి ఇస్తామని కోర్టుకు చెప్పి ఆ తర్వాత డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
More Stories
ఏపీలో అర్ధరాత్రి వరకు పోలింగ్.. 80 శాతానికి చేరువలో ఓటింగ్
ఏపీలో వైసిపి మూకల దాడులపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
పోలీసుల అదుపులో తెనాలి, తాడిపత్రి వైసిపి ఎమ్యెల్యేలు