 
                కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఆయన ఎక్కడికి వెళ్లినా మునుగుతారని, ఇతరులను కూడా ముంచుతారని ఎద్దేవా చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో త్రిశూర్లో బీజేపీ తరుఫున రాజ్నాథ్ ప్రచారం నిర్వహిస్తూ రాహుల్ గాంధీ ఇటీవల కేరళ మత్య్సకారులతో కలిసి సముద్రంలోకి దూకిన సంగతిని గుర్తు చేశారు. రాహుల్తో జాగ్రత్త, ఆయన ట్రాక్ రికార్డ్ మంచిది కాదు అని రాజ్నాథ్ హితవు చెప్పారు.
అమేథి ప్రజలను అడిగితే దీని గురించి చెబుతారని అంటూ గతంలో ఆయన ఎంపీగా ఉన్న ఆ నియోజకవర్గం ఇంకా వెనుకబడి ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు వయనాడ్ను ముంచేందుకు రాహుల్ ఇక్కడికి వచ్చారని ఆరోపించారు.
కేరళలోని అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం, సీఎం విజయన్పైనా రాజ్నాథ్ సింగ్ పలు విమర్శలు చేశారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఒక్కటేనని, ఆ కూటముల నుంచి కేరళ విముక్తి పొందాలని పిలుపిచ్చారు. మరోవైపు వాతావరణం అనుకూలించక ఆయన ప్రయాణించిన విమానం ఆలస్యంగా ల్యాండ్ కావడంతో ఎర్నాకుళంలో బీజేపీ తలపెట్టిన రోడ్ షోను రద్దు చేశారు.





More Stories
సుప్రీంకోర్టు 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
ముంబైలో పిల్లలను బందీలుగా తీసుకున్న ఆర్య కాల్చివేత
రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు