
గత కొన్ని రోజులుగా దేశంలో పెరుగుతూ వస్తున్న పాజిటివ్ కేసులు, ఇవాళ రికార్డుస్థాయికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 46,951 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల్లో ఈ ఏడాది ఇదే అత్యధికం కావడం విశేషం.
అదేవిధంగా చాలా రోజుల తర్వాత మరణాలు రెండు వందలు దాటాయి. నిన్న ఉదయం నుంచి ఇప్పటివకు 212 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 1,16,46,081కు చేరాయి. ఇందులో 1,11,51,468 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,59,967 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు.
కాగా, 3,34,646 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా 21,180 మంది బాధితులు కోలుకున్నారని వెల్లడించింది. దేశంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే 30 వేలు ఉండటం గమనార్హం.
More Stories
విమాన ప్రమాదంలో కాక్పిట్ వాయిస్ రికార్డర్ లభ్యం
జనగణనకు గెజిట్ విడుదల చేసిన కేంద్రం
ప్రపంచవ్యాప్తంగా బడికి దూరంగా 27.2 కోట్ల మంది చిన్నారులు