దేశంలోనే అతిపెద్ద నోటు అయిన 2 వేల రూపాయల నోట్లు ముద్రణ రెండేళ్లుగా జరగడం లేదని లోక్సభలో కేంద్రం వెల్లడించింది. నోట్ల రద్దు తర్వాత కొత్తగా ప్రవేశపెట్టిన ఈ నోటు సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్లు ఆర్థిక శాఖ సహాయక మంత్రి అనురాగ్ ఠాకూర్ ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
2019 నుండి ఏప్రిల్ నుండి ఒక్క నోటు కూడా ముద్రణ జరగలేదని తెలిపారు. 2018 మార్చి 30 నాటికి 3,362 మిలియన్ల ..రెండు వేల రూపాయల నోట్లు సర్క్యులేషన్లో ఉన్నాయని ఠాకూర్ తెలిపారు. సంఖ్యా పరంగా మొత్తం నోట్లలో వీటి వాటా 3.27 శాతం కాగా, విలువ పరంగా 37.26 శాతంతో సమానమని తెలిపారు.
2021 ఫిబ్రవరి 26 నాటికి 2,499 మిలియన్ల నోట్లు మాత్రమే చలామణీలో ఉన్నాయని చెప్పారు. సంఖ్యాపరంగా ఈ వాటా 2.01 శాతం కాగా, విలువ పరంగా 17.78 శాతమని తెలిపారు. ప్రజల డిమాండ్కు అనుగుణంగా ఎన్ని నోట్లు ముద్రించాలనేది ఆర్బిఐని సంప్రదించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఠాకూర్ తెలిపారు.
2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2 వేల రూపాయిల ముద్రణకు సంబంధించి ప్రింటింగ్ ప్రెస్కు ఎలాంటి ఇండెంట్ వెళ్లలేదని స్పష్టం చేశారు
More Stories
పనిమనిషి దగ్గర దొరికిన డబ్బుతో ఝార్ఖండ్ మంత్రి అరెస్ట్
స్పామ్ కాల్స్ నియంత్రణకు త్వరలోనే కొత్త మార్గదర్శకాలు
వడ్డీ రేట్లను భారీగా పెంచిన స్టేట్ బ్యాంకు