భార‌త సాంప్ర‌దాయాల గుర్తింపుకు లౌకిక‌వాద ముప్పు

భార‌త సాంప్ర‌దాయాల‌కు లౌకిక‌వాద ముప్పు పొంచి ఉంద‌ని, ప్ర‌పంచ గుర్తింపున‌కు అందుకే నోచుకోవ‌డం లేద‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్ హెచ్చరించారు. దీని నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి స్వ‌చ్ఛ‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

కంబోడియాలో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అక్క‌డి ప్ర‌ముఖ ఆంగ్‌కోర్ వాట్ ఆల‌యాన్ని సంద‌ర్శించిన యోగి.. ఆ త‌ర్వాత ఈ వ్యాఖ్య‌లు చేశారు. అక్క‌డి ఆల‌యంలోని ఓ గైడ్‌తో జ‌రిపిన సంభాణ గురించి యోగి చెప్పారు. త‌నది బౌద్ధ‌ మ‌తం అని అత‌డు చెప్పాడ‌ని, కానీ ఆ బౌద్ధానికి మూలం కూడా హిందూమ‌త‌మేన‌ని యోగి పేర్కొన్నారు.

కంబోడియాలో ఆ యువ‌కుడికి తన‌ది బౌద్ధ మ‌త‌మ‌ని తెలిసినా దాని మూలాలు కూడా అత‌నికి తెలుసు. అత‌ను ఆ విష‌యాన్ని స్వేచ్ఛ‌గా చెప్పాడు. అదే ఇలాంటి విష‌యాలు భారత్ లో చెబితే చాలా మంది లౌకిక‌వాదం ప్ర‌మాదంలో ప‌డుతుందని తెలిపారు. 

ఈ లౌకిక‌వాద‌మనేది భార‌త ప్రాచీన సాంప్రదాయాల‌కు పెను ముప్పు. వాటికి ప్ర‌పంచ గుర్తింపు లేకుండా చేస్తోందని యోగి ఆదిత్య‌నాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. అస‌లైన జీవిత పాఠాల‌ను చెప్పేవి రామాయ‌ణ, మ‌హాభార‌తాలేన‌ని ఈ సంద‌ర్భంగా యోగి స్ప‌ష్టం చేశారు.

రామ జ‌న్మ‌భూమి అంశం తెరపైకి వ‌చ్చిన స‌మ‌యంలోనూ కొంద‌రు చ‌రిత్ర‌కారులు ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తారు. అస‌లు రాముడు జ‌న్మించిన స్థ‌లం ఇది కాద‌ని అన్నారు. అయోధ్య‌పై అనుమానాలు క‌లిగేలా మాట్లాడారు. ఇటువంటి మనస్తత్వమే  కొన్ని శ‌తాబ్దాలుగా భారత్  రావాల్సిన పేరును రాకుండా చేశాయిని యోగి ఆవేదన వ్యక్తం చేశారు.