కొత్త జాతీయ విద్యా విధానంలో భారతీయ భాషలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. విద్యా రంగానికి కేటాయించిన బడ్జెట్పై జరిగిన చర్చలో వర్చువల్గాపాల్గొంటూ కొత్త విద్యావిధానంలో భారతీయ భాషలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ కాంటెంట్ను స్థానిక భాషల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత భాషా నిపుణులపై ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది తమ బడ్జెట్లో ఆరోగ్యం తర్వాత అధిక ప్రాధాన్యత ఇచ్చిన వాటిలో విద్యారంగం ఉన్నట్లు తెలిపారు. నైపుణ్యం, పరిశోధన, ఆవిష్కరణలకు కూడా అధిక ప్రాముఖ్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఆత్మనిర్బర్ భారత్ నిర్మాణం కోసం యువతలో ఆత్మ విశ్వాసం ఉండాలని, తమ విద్య, నైపుణం, జ్ఞానంపై నమ్మకం ఉన్నవారిలోనే ఆత్మవిశ్వాసం ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో ఉన్న ప్రతిభావంతులను వాడుకోవాలని, భాషా అభ్యంతరాలను, అవరోధాలను అధిగమించాలని సూచించారు.
భారత్ ఇటీవల హైడ్రోజన్ వాహనాన్ని టెస్ట్ చేసిందని చెబుతూ ఇక మన పరిశ్రమ హైడ్రోజన్ను రవాణా కోసం ఇంధనంగా వాడుకోవాలని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్తు ఇంధనం, గ్రీన్ ఎనర్జీ స్కీమ్లు చాలా ముఖ్యమైనవని, దేశాన్ని ఇంధన సమృద్ధిగా మార్చేందుకు అవి ఉపకరిస్తాయని చెప్పారు. అందుకే హైడ్రోజన్ మిషన్ను తాజా బడ్జెట్లో పొందుపరిచామని, ఇదో భారీ వి
హిందు మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వా
More Stories
భారత నేవీ చీఫ్గా దినేష్ త్రిపాఠి
మనం హిందువులమని గర్వంగా చెప్పుకోగలగాలి
పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోండి