వుహాన్ లో వైర‌స్ సోకిన ప్ర‌జ‌లంద‌రికీ ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌లేదు 

వుహాన్ న‌గ‌రంలో వైర‌స్ సోకిన ప్ర‌జ‌లంద‌రికీ చైనా ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌లేద‌ని  డ‌బ్ల్యూహెచ్‌వో బృందం ముఖ్య అధికారి పీట‌ర్ బెన్ ఎంబారెక్  ఆరోపించారు. 2019 డిసెంబ‌ర్‌లోనే వుహాన్‌లో డ‌జ‌న్ల సంఖ్య‌లో క‌రోనా వైర‌స్ స్ట్రెయిన్లు ఉన్న‌ట్లు గుర్తించామ‌ని తెలిపారు. 

చైనాలోని వుహాన్ న‌గ‌రంలో క‌రోనా వైర‌స్ ఆన‌వాళ్లను గుర్తించేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణులు వెళ్లిన విష‌యం తెలిసిందే. 2019 డిసెంబ‌ర్‌లో వుహాన్‌లో చాలా విస్తృత స్థాయిలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.  అయితే ఆ న‌గ‌రంలో ఉన్న ప్ర‌జ‌ల నుంచి ల‌క్ష‌ల సంఖ్య‌లో ర‌క్త న‌మోనాల‌ను ప‌రీక్షించాల‌ని పీట‌ర్ బెన్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. 

చైనా అధికారులు ప‌రిచ‌యం చేసిన తొలి క‌రోనా పేషెంట్‌తో మాట్లాడిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.  ఎటువంటి ట్రావెల్ హిస్ట‌రీ లేని ఆ వ్య‌క్తికి డిసెంబ‌ర్ 8వ తేదీన క‌రోనా సోకిన‌ట్లు నిర్ధారించారు. 2019 డిసెంబ‌ర్ క‌న్నా ముందు నుంచే వుహాన్‌లో చాలా విస్తృత స్థాయిలో వైర‌స్ వ్యాపించిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో శాస్త్ర‌వేత్త‌ల‌కు అంచ‌నాకు వ‌చ్చారు.

డిసెంబ‌ర్‌లో న‌మోదు కేసుల‌కు సంబంధించిన జ‌న్యుప‌దార్ధాల‌ను ప‌రిశీలించిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  డ‌బ్ల్యూహెచ్‌వోల‌ని 17 మంది, చైనాకు చెందిన 17 మంది శాస్త్ర‌వేత్త‌లు క‌రోనా ర‌కాల జ‌న్యువుల‌ను అధ్య‌య‌నం చేసిన‌ట్లు వెల్ల‌డించారు. డిసెంబ‌ర్ 2019 నుంచి సార్స్ సీఓవో2కు సంబంధించి 13 ర‌కాల జ‌న్యు క్ర‌మాల‌ను గుర్తించిన‌ట్లు పీట‌ర్ బెన్ తెలిపారు.

ఒక‌వేళ చైనా రోగుల డేటాతో ఈ జ‌న్యు సీక్వెన్సుల‌ను ప‌రిశీలిస్తే, అప్పుడు ఆ మ‌హ‌మ్మారి ఎక్క‌డ పుట్టింది.. ఎప్పుడు ప్ర‌బ‌లింద‌న్న అంచ‌నాలు వేసే వీలు ఉంటుంద‌ని బెన్ చెప్పారు.  వుహాన్‌లోని సీఫుడ్ మార్కెట్‌, ఇత‌ర ప్రాంతాల నుంచి సేక‌రించిన న‌మోనాల‌ను ప‌రిశీలించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.