కేటీఆర్ ట్వీట్ కు నెటిజెన్ల కౌంటర్

జీడబ్ల్ యూఎంసీ ఆధ్వర్యంలో వరంగల్ లో ఏర్పాటు చేసిన సైకిల్‍ ట్రాక్‍ బాగుందంటూ మున్సిపల్‍ మంత్రి కేటీ ఆర్‍ శనివారం ఉదయం ట్విట్టర్ లో చేసిన పోస్ట్​ వైరల్ అయింది. ‘మస్త్ ఉన్నది.. గ్రేట్‍ సార్‍’ అని కొందరు.. ‘జీడబ్ల్ యూఎంసీ ఎలక్షన్‍ స్టంట్‍’ అని మరొకొందరు కామెంట్ చేశారు. 
 
వావ్‍ వరంగల్‍.. ఎక్సలెంట్‍ వీడియో అని కొందరు చెప్పగా.. మెగా టెక్స్​టైల్‍ పార్క్ వీడియో ఎప్పుడు పెడతారని ఇంకొందరు సమాధానాలు ఇచ్చారు. అలాగే సైకిల్ ట్రాక్ ల నిర్వహణపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేసి రీ పోస్టులు పెట్టారు. 
 
కేటీఆర్ పోస్టుపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. స్మార్ట్​ సిటీ నిధులను  రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్​ చేసినా కేంద్రం నగర అభివృద్ధికి సహకరిస్తుందని పేర్కొన్నారు. మొదట ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ థ్యాంక్స్​ చెప్పాలని హితవు చెప్పారు. 
 
వీడియోలు పెట్టడం కంటే పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. కేంద్రం రైల్వే స్టేషన్లను అందంగా తీర్చిదిద్దితే.. రాష్ట్ర ప్రభుత్వం బస్టాండ్లను భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తారు.