గణతంత్ర దినోత్సవం సందర్భంగా యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారతదేశానికి మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారిని మానవాళి నుంచి దూరం చేసేందుకు యూకే భారతదేశంతో కలిసి పనిచేస్తుందని బోరిస్ జాన్సన్ రిపబ్లిక్ డే వీడియో సందేశంలో చెప్పారు.
కరోనా వ్యాక్సిన్ సహకారంలో భారతదేశం యూకే కలిసి పనిచేస్తున్నాయని బోరిస్ ప్రత్యేకంగా ప్రస్థావించారు.‘‘ ప్రపంచంలోనే అతిపెద్ద సార్వభౌమ ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో అసాధారణ రాజ్యాంగం పుట్టిన రోజు సందర్భంగా బోరిస్ వీడియో సందేశం ఇచ్చారు.
‘‘ నా స్నేహితుడు ప్రధాన మంత్రి మోదీ ఆహ్వానం మేరకు ఈ ముఖ్యమైన సందర్భంలో మిమ్మల్ని కలవాలని నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాను, కాని కొవిడ్ నన్ను లండన్లోనే ఉంచింది’’ అని జాన్సన్ పేర్కొన్నారు.
కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసి ఉత్పత్తి చేయడానికి బ్రిటన్, భారతదేశాల సమిష్ఠి కృషికి కృతజ్ఞతలు అంటూ చెప్పారు. ఈ ఏడాది చివరిలో నేను భారతదేశాన్ని సందర్శించి స్నేహాన్ని బలోపేతం చేస్తానని బోరిస్ వివరించారు.భారతదేశంతో పాటు బ్రిటన్ లో భారత గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ప్రజలకు బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ శుభాకాంక్షలు తెలిపారు.
More Stories
పాక్ కు మిస్సైల్ టెక్నాలజీ ఇచ్చిన చైనా కంపెనీలపై ఆంక్షలు
రష్యన్ వ్యూహాత్మక బాంబర్ను కూల్చేసిన యుక్రెయిన్
టెల్ అవీవ్, దుబాయ్లకు ఎయిరిండియా విమానాలు రద్దు