స్టాలిన్‌పై పోటీకి ఖుష్బూ సిద్ధం !

స్టాలిన్‌పై పోటీకి ఖుష్బూ సిద్ధం !
రాబోయే తమిళనాడు ఎన్నికల్లో పార్టీ హైకమాండ్‌ ఆదేశిస్తే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌పై పోటీ చేస్తానని బీజేపీ నేత, సినీనటి ఖుష్బూ ప్రకటించారు. తెప్పకుళంలో జరిగిన పొంగల్‌ ఉత్సవంలో పాల్గొన్న ఆమె  ‘నేను ఎక్కడ పోటీ చేస్తానో నాకు తెలియదు. అసలు పోటీ చేస్తే (అసెంబ్లీ ఎన్నికల్లో) పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది’ అని తెలిపారు. 
 
డీఎంకే అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌పై పోటీ చేయమని అడిగితే.. ఖచ్చితంగా చేస్తాను అని వెల్లడించాయిరు. వీకే శశికళపై ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కరుణాధి మనుమడి నోటి నుంచి అలాంటి మాటలు రావడం చాలా బాధగా ఉందని ఆమె చెప్పారు. 
 
ఈ మధ్యనే బీజేపీ ఆమెను చెన్నై నగరంలోని చెపాక్ – తిరువళ్ళికెన్ని నియోజకవర్గం ఇన్ ఛార్జ్ గా నియమించడంతో అక్కడి నుండి ఆమె బీజేపీ అభ్యర్థిగా నిలబడనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆమె చెన్నై నగరం అంతటా ఇప్పటికే బీజేపీ ప్రచారం కోసం విస్తృతంగా పర్యటిస్తున్నారు. 
 
కరుణానిధి ఎప్పుడూ మాజీ సీఎం జయలలితపై గౌరవంగానే ప్రసంగించేవారని ఆమె పేర్కొన్నారు. తాను డీఎంకేలో చేరిన సమయంలో. ఎవరికీ వ్యతిరేకంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేయకూడదని సూచించారని ఆమె చెప్పారు.