మాదక ద్రవ్యాల తయారీ ద్వారా తక్కువ సమయంలో కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో ఎండీఎంఏ(మిథైల్ ఎన్డిమాక్స్ మెథా పెటమిన్) తయారీని ప్రారంభించాడు. డ్రగ్స్ తయారీకి మూతపడ్డ ఫార్మా కంపెనీలను ఎంచుకునేవాడు. తయారీ మొదలు.. సరఫరా దాకా ఎక్కడా రంగంలో ఉండేవాడు కాదు. ఇప్పటి వరకు వందల కోట్లు విలువ చేసే ఎండీఎంఏను దేశ విదేశాల్లోని స్మగ్లర్లకు విక్రయించాడని పోలీసులు గుర్తించారు.
ఎస్వోటీ పోలీసులు నోవెటెక్లో జరిపిన తనిఖీల్లో ఎక్కడా డ్రగ్స్ జాడ లభ్యం కాలేదు. దీంతో రాచకొండ, సైబరాబాద్ పరిధుల్లోని కొంపల్లి, చర్లపల్లి, నాచారం, ఘట్కేసర్, చౌటుప్పల్, బీబీనగర్ ప్రాంతాల్లోని మూత పడ్డ ఫార్మా కంపెనీలను జల్లెడ పడుతున్నారు. వేదప్రకాశ్ అరెస్టుకు ముందు అతడి ఫోన్ చౌటుప్పల్లో స్విచాఫ్ అయ్యింది. దీంతో పోలీసులు.. చౌటుప్పల్ పరిసరాల్లోని మూతపడ్డ ఫార్మా కంపెనీలపై దృష్టిసారించారు. ఫోన్ స్విచాఫ్ అవ్వడానికి ముందు వేదప్రకాశ్ ఎవరెవరితో మాట్లాడాడు? ఎక్కడెక్కడ తిరిగాడు? అనే కోణాలపై దృష్టిసారించారు.
అటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలోనూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) పలు ఫార్మా కంపెనీల్లో డ్రగ్స్ తయారీ గుట్టును రట్టు చేసింది. గత ఏడాది ఆగస్టు 17న నగరంలోని ఓ పరిశ్రమతో పాటు, ముంబైలోని మరో పరిశ్రమలో దాడులు చేపట్టింది.
ఈ దాడుల్లో నగరంలో రూ.97కోట్లు విలువ చేసే 500 కిలోల డ్రగ్స్ను సీజ్ చేసింది. కొంపల్లి, చర్లపల్లి, చౌటుప్పల్ ప్రాంతాల్లోనూ గతంలో ఇలాంటి డ్రగ్స్ తయారీ కంపెనీలను డీఆర్ఐ గుర్తించింది.
More Stories
జైనూర్ లో గిరిజనులు, ఆదివాసుల ఇళ్లపై దౌర్జన్యం!
ఆదిలాబాద్లో తొలి ట్రిపుల్ తలాక్ కేసు
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పాలన మారలేదు