ఏపీలో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూ ఉంటె వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని మతాల వారితో కమిటీలు వేస్తామని ప్రకటించడం పట్ల బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మత సామరస్యాన్ని పెంపొందించేందుకు కమిటీలు అంటూ ప్రజలు ను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎపి లో హిందూ మతం పై దాడి జరుగుతుంటే అన్నిమతాలతో కమిటీలు ఎందుకని ప్రశ్నించారు.
ఇతర మతాల పెద్దలు, కమిటీలు ఈ దాడులను ఎందుకు ఖండించరని ఆయన నిలదీశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోక పోవడం పై ఎందుకు ప్రశ్నించరని విస్మయం వ్యక్తం చేశారు. ఈ దాడులకు సంబంధించిన ఆధారాలు సేకరించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
కమిటీలు లో అన్ని మతాల నుంచి ప్రతినిధులు ఉంటారని చెబుతున్నారని పేర్కొంటూ ఎపి లో తొంభైశాతం హిందువులు ఉన్నారని, హిందూ మతం పై దాడి చేస్తే ఇతర మతస్తులు కమిటీలు లో ఉండి ఏం చేస్తారని నిలదీశారు.
ఇక్కడ మతం పై మరో మతం వారు దాడి చేయడం లేదని, అందరూ అన్మ దమ్ముల్లా కలిసి ఉన్నారని జివిఎల్ చెప్పారు. దయచేసి వారి మధ్య విద్వేషాలు సృష్టించ వద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు చెప్పారు. హిందూ వ్యతిరేక రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బుద్ది చెబుతామని హెచ్చరించారు. ఇప్పటివరకు దాడుల ఘటనల్లో ఎంత మందిని అరెస్టు చేశారు? వారెవరు, ఏ సెక్షన్లు పెట్టారో.. ప్రభుత్వం ఎందుకు చెప్పదని నిలదీశారు. వైసిపి రాజకీయ భవిష్యత్తు ను దృష్టి లో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని హితవు చెప్పారు.
హిందూ పెద్దలు ఎందరో ఈ దాడులను ఖండించారని, ఇతర మతాల పై దాడి వద్దని చెప్పారని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా ఆయా మత పెద్దలు కుడా తమ వారికి ప్రకటనలు చేయాలని జివిఎల్ డిమాండ్ చేశారు.
వైసిపి ప్రభుత్వం అకృత్యాలు ను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.
More Stories
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం
రేవణ్ణ విదేశీ పర్యటనలో ప్రభుత్వ సంబంధం లేదు
లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం