ప్రముఖ సినీగేయ రచయిత వెన్నెలకంటి (64) కన్నుమూశారు. గుండెపోటుతో మంగళవారం చెన్నైలో మరణించారు. వెన్నెలకంటి మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పలు డబ్బింగ్ సినిమాలకు డైలాగ్ రైటర్ గా పనిచేసిన వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్.తమిళ చిత్రాలను తెలుగులో అనువాదం చేసే విషయంలో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉండేది. లిరిసిస్ట్గానూ ఆయన ఎన్నో పాటలను రచించారు.
ఎస్. గోపాల్రెడ్డి తీసిన మురళీ కృష్ణుడు (1988) మూవీతో వెన్నెలకంటి తెలుగు చిత్రసీమకు గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఈ మూవీలో ఆయన రాసిన అన్నీ పాటలు సూపర్ హిట్ అవడంతో వెన్నెలకంటికి మంచి పేరు, గుర్తింపు వచ్చింది. అనేక మేటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలు పాపులర్ అయ్యాయి. ఆదిత్యా 369, తీర్పు, క్రిమినల్, శీను, టక్కరి దొంగ, మిత్రుడు, రాజా తదితర చిత్రాలకు ఆయన రాసిన పాటలు అభిమానులను ఉర్రూతలూగించాయి.
వెన్నెలకంటి తండ్రి ‘ప్రతిభా’ కోటేశ్వరరావుకూ సినీ అనుబంధం ఉంది. ఎస్పి బాలు ప్రోత్సాహంతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు. జంధ్యాల రాసిన ”ఏక్ దిన్కా సుల్తాన్, ఈ చరిత్ర ఏ సిరాతో, ఎవ్వనిచే జనించు, దర్పణం” వంటి నాటకాలలో వెన్నెలకంటి నటించారు. హాలీవుడ్ చిత్రాల తెలుగు డబ్బింగ్ వెన్నెలకంటితోనే ఆరంభం అయ్యాయి. 34 ఏళ్లలో 1,500కు పైగా పాటలు రాసిన వెన్నెలకంటి.. డబ్బింగ్ చిత్రాల్లో మరో 1,500కు పైగా పాటలు రాశారు. పాటలు రాయడంతో పాటు ప
వెన్నెలకంటి ఇద్దరు తనయులు కూడా సినిమా పరిశ్రమలో మంచి పేరును పొందారు. శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ చిత్రాలకు డైలాగ్ రైటర్గా పనిచేస్తుంటే.. మరో తనయుడు రాకేందు మౌళి లిరిసిస్ట్, సింగర్ మరియు నటుడిగా గుర్తింపును పొందారు.
More Stories
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆగని మంటలపై `సుప్రీం’ మండిపాటు
ఎన్నికల వేళ పాక్ సరిహద్దులో 49 డ్రోన్లు స్వాధీనం
విపత్తుల ఫలితంగా భారత్ లో 5 లక్షల మంది నిరాశ్రయం