మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ‘నాకు కరోనా పాజిటివ్గా తేలింది. ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నాను. త్వరగా కోలుకుంటానని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీటర్ ద్వారా తెలిపారు.
గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. తన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలిజయజేస్తాను అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజు అనే పాత్రలో కనిపించనున్నారు. మరి కొద్ది రోజులలో చిత్ర షూటింగ్ పూర్తవుతుందని అనుకునే క్రమంలో రామ్ చరణ్కు కరోనా సోకడం చిత్ర బృందాన్ని ఆందోళనకు గురిచేస్తుంది.
నాలుగు రోజుల క్రితం చరణ్ కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్టమస్ జరుపుకున్నారు. వీరంతా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి. అంతేకాక రెండు రోజుల క్రితం చరణ్ ఆచార్య సెట్కి వెళ్లారు. డైరెక్టర్ కొరటాల శివ, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వ రాజన్ను కలిశారు. దర్శకుడు కొరటాలతో కలిసి టీ తాగుతూ అందరిని పలకరించారు. ఇక ప్రస్తుతం చరణ్కి కోవిడ్ పాజిటివ్గా తేలడంతో వీరందరిలో ఆందోళన మొదలైంది.
More Stories
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆగని మంటలపై `సుప్రీం’ మండిపాటు
ఎన్నికల వేళ పాక్ సరిహద్దులో 49 డ్రోన్లు స్వాధీనం
విపత్తుల ఫలితంగా భారత్ లో 5 లక్షల మంది నిరాశ్రయం