కేసీఆర్ ఓ జిమ్మిక్కుల ముఖ్యమంత్రి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ధ్వజమెత్తారు. ముందస్తు పథకం ప్రకారమే గ్రేటర్ ఎన్నికలను హడావుడిగా నిర్వహించారని తెలిపారు. వరద సాయం పేరుతో ఎన్నికల్లో లబ్ది పొందాలని కేసీఆర్ అనుకున్నారని, అయితే ప్రజలు మరోవిధంగా తీర్పు ఇచ్చారని చెప్పారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లతో సమావేశమైన ఆయన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. టీఆర్ఎస్ చెప్పు చేతల్లో ఎన్నికల కమిషన్ నడిచిందని మండిపడ్డారు. అభ్యర్థులను ఖరారు చేసేందుకు కూడా సమయం ఇవ్వలేదని చెప్పారు.
ఎలాగైనా గెలవాలని అడ్డదారులు తొక్కారని ఆరోపించారు. అయినా గ్రేటర్ ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కార్యకర్తలంతా కలసి కట్టుగా శ్రమించారని సంజయ్ అభినందించారు. బండి సంజయ్… దుబ్బాక ఫలితం తర్వాత కేసీఆర్కు భయం పట్టుకుందని, అందుకనే హడావుడిగా ఎన్నికలు జరిపారని చెప్పారు.
కార్పొరేటర్ల సన్మాన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ, ఎన్నికల కమిటీ చైర్మన్, కేంద్ర సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి, కన్వినర్, ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్, జాయింట్ కన్వినర్లు వివేక్ వెంకటస్వామితో పాటు బీజేపీ ముఖ్యనేతలు హాజరయ్యారు.
More Stories
బిజెపి రేజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదు
బీజేపీతోనే గిరిజన, దళితులకు గౌరవం
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు