లవ్జీహాద్ కేసుల్లో నిందితులకు 10సంవత్సరాల జైలుశిక్ష విధించేలా మధ్యప్రదేశ్ రాష్ట్రం కొత్త ముసాయిదా చట్టాన్ని తయారు చేసింది. ముస్లిమ్ యువకులు హిందూ యువతులను ప్రేమించి వివాహం చేసుకుంటే వారికి పదేళ్ల జైలు శిక్ష విధించనుంది.
బిజెపి నేతృత్వంలోని మధ్యప్రదేశ్ సర్కార్ లవ్జిహాద్ను అనుమతించమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తెలిపారు. బలవంతంగా మోసం చేసి మతాంతరర పెళ్లి చేసుకొని ప్రలోభాల ద్వారా మతమార్పిడిని నిషేధించే ఆర్డినెన్స్ను యూపీ సర్కారు మొన్న ఆమోదించింది.
యుపి ఆర్డినెన్సు ఆమోదించిన ఒక రోజు తర్వాత మధ్యప్రదేశ్ సర్కారు కొత్త చట్టాన్ని రూపొందించింది. అలాగే ఈ కేసులో నిందితులను అరెస్టు చేశాక 45రోజుల వరకు బెయిల్ పొందలేరని, గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధిస్తారని మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు.
డిసెంబర్ 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడతామని వెల్లడించారు. మతాంతర వివాహాలు చేసే వివిధ మతాల గురువులకు ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించడంతో పాటు మత మార్పిడులను ప్రోత్సహించే సంస్థలను రాష్ట్రప్రభుత్వం రద్దు చేయనుందని మంత్రి తెలిపారు.
More Stories
కొత్త ప్రభుత్వానికి 100 రోజుల మాస్టర్ ప్లాన్!
లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ నేడే
మోదీ వారణాసిలో రేపే నామినేషన్.. ఘనంగా రోడ్ షో