నోట్ల రద్దు వల్ల పన్ను చెల్లింపులు బాగా పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తెలిపారు. నోట్ల రద్దు జరిగి నాలుగేళ్లు అయిన సందర్భంగా నిర్మలా సీతారామన్ పలు ట్వీట్లు చేశారు.
‘అవినీతి రహిత భారత్ను నిర్మించే దిశగా మోదీ సర్కార్ నాలుగేళ్ల కిందట నోట్ల రద్దును చేపట్టింది. దీన్ని నల్ల ధనంపై జరిపిన దాడిగా చెప్పొచ్చు. దీని ఫలితంగా ట్యాక్స్ కలెక్షన్ బాగా పెరగడంతోపాటు పారదర్శకత వచ్చింది. ఇప్పుడు డిజిటల్ ఎకానమీ దూసుకెళ్తోంది’ అని ఆమె పేర్కొన్నారు.
నోట్ల రద్దుకు ముందు చేసిన పలు సర్వేల్లో లెక్కల్లో లేని ఆదాయం రూ.కోట్లలో పేరుకుపోయిందని ఆమె తెలిసింది. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో ఆపరేషన్ క్లీన్ మనీ చాలా సాయపడిందని నిర్మలా సీతారామన్ చెప్పారు.

More Stories
రామమందిరం కానుకలపై సిట్ పునర్వ్యవస్థీకరణ
మాజీ సిఎం విజయన్ కుమార్తెకు రూ.2.78 కోట్ల అక్రమ చెల్లింపులు
వెట్టిచాకిరీ కార్మికులతో ఉత్పత్తులపై అమెరికా 10 శాతం సుంకం