
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కె అచ్చెన్నాయుడుని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు నియమించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణనే కొనసాగిస్తూ తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని నియమించారు. 27 మందితో టీడీపీ సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేయగా, 25 మందితో టీడీపీ పొలిట్ బ్యూరో ఏర్పాటు చేశారు.
జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్రెడ్డి, నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్రావు, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రతిభా భారతి, కాశీనాథ్, గల్లా అరుణ, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావులను నియమించారు.
పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల, అశోక్గజపతిరాజు, అయ్యన్న, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి, కాలవ శ్రీనివాసులులను నియమించారు.
పొలిట్ బ్యూరో సభ్యులుగా బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బొండా ఉమా, ఫారూక్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాస్రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల, అరవింద్కుమార్గౌడ్ లను నియమించారు.
పొలిట్ బ్యూరో సభ్యులుగా నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, ఎల్.రమణ కూడా కొనసాగుతున్నారు. జాతీయ టీడీపీ అధికార ప్రతినిధులుగా దీపక్రెడ్డి, పట్టాభి రామ్, నసీర్, ప్రేమ్కుమార్, జోత్స్న, నన్నూరి నర్సిరెడ్డి, అశోక్బాబు నియమితులయ్యారు.
కాగా, క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా బచ్చుల అర్జునుడు, క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా మునిరత్నం, జి.నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావులకు బాధ్యతలు అప్పగించారు. కోశాధికారిగా శ్రీరాం రాజగోపాల్ తాతయ్య నియమితులయ్యారు.
More Stories
తన తండ్రి హత్యా కేసుపై గవర్నర్ కు డా. సునీత ఫిర్యాదు
అవిశ్వాస తీర్మానంకు భయపడి గుంటూరు మేయర్ రాజీనామా
మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను