తమ బ్యాంకుల్లో సొమ్ము దాచుకున్న మనోళ్ల వివరాలను స్విట్జర్లాండ్ పంపించింది. ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ) ఒప్పందంలో భాగంగా స్విస్ సర్కారు ఈ జాబితాను అందించింది.
విదేశాల్లో దాచిన బ్లాక్మనీపై పోరాటంలో భాగంగా కేంద్రం చేపట్టిన చర్యల ఫలితంగానే ఈ వివరాలను అందుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. విదేశాల్లో దాచిన నల్లధనంపై పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి ఇది మరో కీలక మైలురాయిగా చెప్పుకోవచ్చు.
గత ఏడాది సెప్టెంబరులో భారత్ తొలి జాబితాను అందుకుంది. వచ్చే ఏడాది మరో జాబితా రానుంది.ఇందుకోసం స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో ఇన్ఫర్మేషన్ ఎక్చేంజ్ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 86 దేశాలతో స్విట్జర్లాండ్ ఈ ఒప్పందం చేసుకుంది.
2018 వరకు యాక్టివ్గా ఉన్న, క్లోజ్ చేసిన ఖాతాల వివరాలను ఈ జాబితాలో పంపించింది. అంతకుముందు కూడా భారత్ కోర్కె మేరకు వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వంద మంది ఖాతాల వివరాలను అందజేసినట్లు స్విస్ అధికారులు తెలిపారు.
కాగా భారత్కు అందిన సమాచారం ఆధారంగా పన్ను చెల్లింపుదారులు తమ టాక్స్ రిటర్నులలో ఆర్థిక ఖాతాల వివరాలను సరిగ్గా ప్రకటించారా లేదా అన్నది పన్ను శాఖ అధికారులు ధ్రువీకరించుకోనున్నారు.
ఇక, ఈ ఏడాది మొత్తం 75 దేశాలకు చెందిన 31 లక్షల వ్యక్తులు, సంస్థల ఖాతాల వివరాలను ఆయా దేశాలకు వెల్లడిస్తామని ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్టీఏ) వెల్లడించింది.
More Stories
16 శాతం తగ్గిన ముడి చమురు దిగుమతుల చెల్లింపులు
రూ 100 కోట్ల శిల్పాశెట్టి భర్త ఆస్తుల ఈడీ జప్తు
నెస్లే సెరిలాక్లో మోతాదుకు మించి షుగర్