![](https://nijamtoday.com/wp-content/uploads/2020/10/Tonsure-WG-1024x768.jpg)
జంగారెడ్డిగూడెం ఎస్సై కుటుంబరావు తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడేనికి చెందిన అలక అభిలాష్ (23) జంగారెడ్డిగూడేనికి చెందిన యర్రసాని విజయ్బాబు వద్ద మూడు నెలల క్రితం రూ.30 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ బాకీని తీర్చాలంటూ విజయ్బాబు గత మూడు రోజులుగా అభిలాష్ని అడుగుతున్నాడు.
ఇదే విషయమై అక్టోబర్ 3వ తేదీన రాత్రి విజయ్బాబు, తన మిత్రులు షేక్ నాగూల్ మీరావళి, కంకిరెడ్డి మార్కేండేయులతో కలిసి తాడేపల్లిగూడెంలోని అభిలాష్ ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి అభిలాష్ను కారులో ఎక్కించుకుని నేరగా జంగారెడ్డిగూడెం బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీకి తీసుకువచ్చి ఓ ఇంట్లో ఉంచారు.
తీసుకున్న అప్పు తీర్చలేకపోవడంతో మరో వ్యక్తితో అభిలాష్కు శిరోముండనం చేయించారు. అనంతరం బాధితుడిని స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. అనంతరం అభిలాష్ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేశారు.
More Stories
ఏపీలో హత్యకు గురైన వారి పేర్లు చెప్పమని చంద్రబాబు సవాల్!
వైసిపి ఆర్ధిక దోపిడీతో ఏపీకి రూ. 76,795 కోట్ల నష్టం
కాంట్రాక్టర్లను మార్చడంతోనే పోలవరం పనుల్లో జాప్యం