రోజు రోజుకూ బలహీనంగా మారుతున్న ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ వల్ల లక్షల మందిఉద్యోగాలు కోల్పోయారు. ఎన్నో వ్యాపారాలు మూతబడ్డాయి. కొత్త ఉద్యోగాలు కల్పించడం, అన్ని రంగాలలో డిమాండ్ పెంచడమే లక్ష్యంగా ఈ ప్యాకేజీ తయారవుతున్నట్టు తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇదివరకు ప్రకటించిన గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ, ఆత్మనిర్భర్ ప్యాకేజీ కంటే ఈసారి ప్యాకేజీకి మరిన్ని నిధులు కేటాయిస్తారు. పట్టణ ఉపాధి హామీ పథకానికి రూ.35 వేల కోట్లు ఇస్తారు. దాదాపు 25 భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఈ ఏడాదిలోపే పూర్తి చేయడానికి నిధులు సమకూరుస్తారు. గ్రామీణ ఉపాధి, రైతు సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు కొనసాగుతుంది.
పేదలకు ఉచితంగా ఆహారం, డబ్బు అందించడాన్ని కూడా ఆపివేసే అవకాశం లేదు. మరికొన్ని వారాల్లోపే ఈ ప్యాకేజీని ప్రకటించవచ్చు. వచ్చే నెల మూడో వారం తరువాత దసరా, దీపావళి పండగలు వస్తున్న దృష్ట్యా వాణిజ్యానికి ముఖ్యమైన ఈ పండుగల లోపుగానే ప్రకటించే అవకాశం ఉంది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ ఈజీఏ) మాదిరే పట్టణ ఉపాధి హామీ పథకంఉండనుంది. ఈ విషయమై సంబంధిత అధికారులు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ముందుగా పెద్ద పట్టణాల్లో ఈ పధకాన్ని అమలు చేశాక టైర్ –3, టైర్ –4 సిటీలకూ అందుబాటులోకి తెస్తారు.
కరోనా వ్యాక్సిన్ వచ్చాకే కొత్త ప్యాకేజి ప్రకటిస్తామని ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారుడు కృష్ణమూర్తి సుబ్రమణియన్ గత జులైలో ప్రకటించినా ఇప్పట్లో వ్యాక్సిన్ వచ్చే అవ్కాఆశం కనిపించక పోవడం, కరోనా కేసులు పెరుగుతూనేఉండటం, జీడీపీ లెక్కలు నిరాశ కలిగిం చడంతోమూడో ప్యాకేజీ కూడా ఇవ్వాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు.
మార్కెట్లోకి మరింత డబ్బును పంపించ గలిగితేనే ఆర్ధిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించ వచ్చని అంచనా వేస్తున్నారు. అన్నింటికంటే ఉపాధిని కల్పిం చడానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. ఏప్రిల్ –జూన్ క్వార్టర్ జీడీపీ 23.9 శాతం తగ్గింది. భారత్ కు స్వాతంత్య్రం వచ్చాక, జీడీపీ ఇంత తక్కువగా ఉండటం ఇదే మొదటిసారి.
మరోవంక, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, చైనా కంపెనీలను మన దగ్గరికి తీసుకురావడానికి కూడా కేంద్రం ప్రయత్నాలను మొదలుపెట్టింది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్, ఫార్మా, మెడిసిన్స్ రంగాలకు ఇస్తున్న ప్రొడక్సన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ (పీఎల్ఐ)ను మరిన్ని రంగాలకు అందించనుంది. టెక్స్ టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, సోలార్ ప్యానెల్స్, ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కంపెనీలకు కూడా పీఎల్ఐ స్కీమ్ ను వర్తింపజేయనుంది.
సులభతరం వాణిజ్యంను మెరుగుపర్చడానికి చట్టాల్లోమార్పులు తీసుకురానున్నారు. ఫార్మాకంపెనీలు చైనాపై ఆధారపడకుండా చేయడానికి ఇది వరకే 53 బల్క్ డ్రగ్స్ ప్రొడక్షన్ ను పీఎల్ఐ కిందకు తీసుకుచ్చింది. దీని విలువ రూ.6,940 కోట్లు. ఫలితంగా 136 ఫార్మా కంపెనీలకు మేలు జరుగుతుంది. అదనంగా రూ.46 వేల కోట్ల విలువైన మందులు తయారవుతాయి.
More Stories
సైఫ్ అలీ ఖాన్పై దాడిలో అండర్వరల్డ్ హస్తం లేదు!
ఇక విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ సమస్య ఉండదు
ముడా స్కామ్లోరూ. 300 కోట్ల ఆస్తుల జప్తు