
కరోనా నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వ్యాపారవేత్తలకు శనివారం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. 1,350 కోట్లతో ఈ ప్యాకేజీని ప్రకటించారు. నీరు, విద్యుత్ బిల్లుల్లో ఏకంగా 50 శాతం రాయితీని ప్రకటించారు.
దీనితో పాటు రుణాన్ని తీసుకునే వారందరికీ 2021 మార్చి వరకు స్టాంప్ డ్యూటీని మినహాయింపును కూడా ప్రకటించారు. అదే విధంగా పర్యాటక రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకు ‘హెల్త్- టూరిజం’ పథకం కింద సాయాన్ని కూడా ప్రకటించారు.
చేనేత, హస్త కళల రంగంలో ఉన్న వారికి క్రెడిట్ కార్డ్ పథకం కింద లక్ష నుంచి 2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి యువత, మహిళా వ్యాపారవేత్తలకు బ్యాంకుల్లో ప్రత్యేక డెస్క్ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు.
ఆరు నెలల పాటు వ్యాపార సంఘంలోని ప్రతి రుణ గ్రహీతకు బేషరతుగా 5 వాతం వడ్డీని కూడా చెల్లించాలని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఉపాధిని కల్పించడంలో ఈ ప్యాకేజీ ఎంతో ఉపకరిస్తుందని ఎల్జీ మనోజ్ సిన్హా పేర్కొన్నారు.
‘‘1,350 కోట్లతో వ్యాపార వేత్తలకు ఓ ఆర్థిక ప్యాకేజీని ఆమోదించాం. గతంలో ప్రధాని మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ ప్రయోజనాలకు ఇది అదనం.’’ అని ఎల్జీ సిన్హా తెలిపారు.
More Stories
గూడ్సు పట్టాలు తప్పలేదు.. కోరమాండల్ రైలే ఢీకొట్టింది
రైల్వే ప్రమాదానికి కారణం, బాధ్యులను గుర్తించాం
రైలు ప్రమాద కారకులను కఠినంగా శిక్షిస్తాం