పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతుండగా ఐదుగరు లోక్సభ ఎంపీలకు కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. సభా సమావేశాలకు హాజరయ్యేందుకు సభ్యులు తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ రిపోర్టును సమర్పించాలి.
ఉభయ సభల సభ్యుల సౌకర్యార్థం పార్లమెంట్ ప్రాంగణంలో మూడు కోవిడ్ టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యేనాటికి 72 గంటల ముందు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని ఉభయ సభల సభ్యులను కోరారు.
ప్రభుత్వ అనుమతి పొందిన ఏదైనా ఆసుపత్రి/ల్యాబొరేటరీలో పరీక్షలు చేయించుకోవాలని కోరారు. సభ్యులంతా దాదాపుగా ఇప్పటికే పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాలు రావాల్సి ఉన్నాయి.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ఏడాది పార్లమెంటు సమావేశాల నిర్వహణలో చాలా మార్పులు చేశారు.పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు అఖిల పక్ష సమావేశం నిర్వహించడం సంప్రదాయం. కానీ ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా దీనిని రద్దు చేశారు.
నేరుగా బీఏసీ సమావేశం నిర్వహించి సభలో చర్చించాల్సిన అంశాల అజెండాను ఖరారు చేశారు. క్వశ్చన్ అవర్ను తీసేశారు. జీరో అవర్ను తగ్గించేశారు. ప్రతీ రోజు నాలుగు గంటలపాటు మాత్రమే సమావేశాలు జరగనున్నాయి.

More Stories
`మహాధర్నా’ రాబోయే రోజుల్లో `మహా ధర్మయుద్ధ్’గా మారుతుంది
సరిహద్దులకు కనెక్టివిటీతోనే ఆపరేషన్ సిందూర్ విజయం
పుతిన్ కు `రెడ్ కార్పెట్’… ఇప్పుడు జెలెన్స్కీ కోసం ఎదురు చూపు