ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాల పై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కె. రఘురామకృష్ణంరాజు రేపు 8 గంటల పాటు గాంధేయ పద్దతిలో నిరసన దీక్ష తలపెట్టారు. ఈ దీక్ష కార్యక్రమంను శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఢిల్లీ లోని తన నివాసంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
కోవిద్ మహమ్మారిని దృష్టిలో వుంచుకొని కోవిద్ నిబంధనలు పాటిస్తూ ఈ దీక్షా కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. దేవాలయాలపై దాడులు జరగకుండా వాటిని నివారించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇప్పటి వరకు జరిగిన దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ సంఘటనల పై ఉన్నతస్థాయిలో దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు.
దేవాలయాలు పరిరక్షణకు చేపడుతున్న ఈ పవిత్ర దీక్షా కార్యక్రమంకు కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరు నైతిక మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేయారు.
More Stories
ఏపీ అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు
`ఇంటింటి ప్రచారం’కు ముందస్తు అనుమతి నిబంధన నిలిపివేత
ఏపీలో ఇంటింటి ప్రచారానికి అనుమతి తప్పనిసరి!