ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాల పై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కె. రఘురామకృష్ణంరాజు రేపు 8 గంటల పాటు గాంధేయ పద్దతిలో నిరసన దీక్ష తలపెట్టారు. ఈ దీక్ష కార్యక్రమంను శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఢిల్లీ లోని తన నివాసంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
కోవిద్ మహమ్మారిని దృష్టిలో వుంచుకొని కోవిద్ నిబంధనలు పాటిస్తూ ఈ దీక్షా కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. దేవాలయాలపై దాడులు జరగకుండా వాటిని నివారించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇప్పటి వరకు జరిగిన దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ సంఘటనల పై ఉన్నతస్థాయిలో దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు.
దేవాలయాలు పరిరక్షణకు చేపడుతున్న ఈ పవిత్ర దీక్షా కార్యక్రమంకు కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరు నైతిక మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేయారు.

More Stories
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై అనవసర దుష్ప్రచారం
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భైరవకోన
ఏపీకి చెందిన టెకీ హర్యానాలో దారుణ హత్య