ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లాలోని కలహండి-కందమాల్ సరిహద్దు బండరంగి సిర్కి అటవీ ప్రాంతంలో నేడు చోటుచేసుకుంది.
భద్రతా బలగాల సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా ఒడిశా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్కు చెందిన ఓ జవాను గాయపడ్డాడు. గాయపడ్డ జవాన్ను చికిత్స నిమిత్తం తరలించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్(డీవీఎఫ్)తో కలిసి ఎస్వోజీ మంగళవారం నుంచి కూంబింగ్ ఆపరేషన్ను చేపట్టాయి.
ఈ ఉదయం 11 గంటలకు ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. నాలుగున్నర గంటలపాటు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. సంఘటనా స్థలంలో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

More Stories
భారత్ కు 10 బిలియన్ డాలర్ల జపాన్ పెట్టుబడులు
న్యాయ ప్రక్రియలో ఏఐ సృష్టించే పత్రాలపై `జీరో’ సహనం
10 నుంచి బెళగావిలో ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ ల సమావేశాలు