లవ్ జిహాద్ కేసు‌లో జకీర్ నాయక్   

వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ తోపాటు పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు రాడికల్స్‌ను లవ్ జిహాద్ కేసులో నిందితులుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఆరోపించింది. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త కుమార్తె, బంగ్లాదేశ్‌లోని ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడి లవ్ జిహాద్ కేసులో జకీర్ నాయక్ ప్రధాన నిందితుడని ఎన్ఐఏ పేర్నొన్నది. ఈ నాయకుడు మాజీ ప్రధాని ఖలీదా జియా కు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందినవారుగా గుర్తించారు.

భారత వ్యాపారవేత్త కుమార్తెతో బంగ్లాదేశ్ రాజకీయ నాయకుడి కుమారుడికి లండన్‌లో జరిగిన వివాహంపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో జకీర్ నాయక్, పాకిస్తాన్ సంతతికి చెందిన ఇద్దరు రాడికల్ మత బోధకులు యాసిర్ కడి, నౌమాన్ అలీ ఖాన్ పేర్లు ఉన్నాయని సమాచారం. కొద్ది రోజుల క్రితం జకీర్ నాయక్ వీడియోను యాసిర్ కడి షేర్ చేశాడు.

ఆర్టికల్ 370 ను తొలగించడానికి మద్దతు ఇస్తే అతను సురక్షితంగా తిరిగి రాగలడని భారత్ తనకు చెప్పిందని నాయక్ చెప్పినట్లుగా ఉన్న మాటలు వీడియోలు ఉన్నాయి. తన కుమార్తెను కిడ్నాప్ చేశారని వ్యాపారవేత్త ఆరోపించిన తరువాత మే నెలలో చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ వద్ద ఫిర్యాదు చేశారు.

తన కుమార్తె లండన్‌లో చదువుతున్నదని, అక్కడ ఆమె ఒక రాడికల్‌తో పరిచయం ఏర్పడగా అతను ఇస్లాం మతాన్ని అనుసరించాలంటూ బలవంతం చేసి కిడ్నాప్ చేసి బంగ్లాదేశ్‌కు తరలించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు విదేశాలలో జరగాల్సి ఉన్నదని, అందువలన ఈ కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేసినట్లు చెన్నై పోలీసు కమిషనర్ మహేష్ కుమార్ అగర్వాల్ తెలిపారు.

మే 28 న కేసు నమోదుచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తమిళనాడు ప్రభుత్వం కోరింది. బీఎన్‌పీ నాయకుడి కేసులో ప్రధాన నిందితుడు ఈ కేసులో మాజీ బీఎన్‌పీ ఎంపి షాఖావత్ హుస్సేన్ బుక్లే కుమారుడు నఫీస్. బాకుల్ 1991, 2001 ఎన్నికల్లో నర్సింగ్డి-4 నుంచి గెలిచారు. 2013 డిసెంబర్‌లో ఖలీదా జియా నివాసం నుంచి అతన్ని అరెస్టు చేశారు.

జకీర్ నాయక్ భారతదేశంలో మనీలాండరింగ్, మూర్ఖత్వానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. అరెస్టుకు భయపడి జకీర్ నాయక్ 2016 లో మలేషియాకు పారిపోయాడు. 2017 జూన్ లో నాయక్‌ను కోర్టు నేరస్థుడిగా ప్రకటించింది. మలేషియాలోని మైనారిటీ హిందువుల మనోభావాలను దెబ్బతీసేట్లుగా ప్రసంగాలు చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.