రూపే కార్డులు, బీమ్యూపిఐలతో సాగిన డిజిటల్ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలను తిరిగి వినియోగదారులకు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ బ్యాంకులకు సూచించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి వసూలు చేసిన ఛార్జీలను వెంటనే చెల్లించాలని ఆదేశించింది.
ఈమేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఆ మేరకు సర్కులర్ విడుదల చేసింది. ఐటి చట్టం లోని సెక్షన్ 269 ఎస్యును అనుసరించి ఈ డిజిటల్ లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలను వసూలు చేయరాదని స్పష్టం చేసింది. డిజిటల్ లావాదేవీల పెంపు, నగదు రహిత ఆర్థిక వ్యవస్థను రూపొందించడానికి ఫైనాన్స్ యాక్ట్ 2019 లో కేంద్రం ఈ సెక్షన్ను చేర్చింది.
రూపే, డెబిట్ కార్డు బీమ్ యూపిఐ, యూపిఐ క్యూ ఆర్ కోడ్లను నిర్దేశిత ఎలెక్ట్రానిక్ వ్యవస్థల కింద నోటిఫై చేసింది. అందువల్ల ఈ రూపంలో చెల్లించిన వారికి వెంటనే వసూలు చేసిన ఆయా ఛార్జీలను చెల్లించాలని సిబిడిటి సూచించింది. అలాగే వీటికి ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) వర్తించదని పేర్కొంది.

More Stories
షట్డౌన్ తో అమెరికాకు నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల నష్టం
అక్టోబర్ లో రికార్డు స్థాయిలో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్టీ
రూ 700 కోట్ల అక్రమాస్తులు.. పంజాబ్ మాజీ మంత్రిపై దర్యాప్తు