
అంతర్గత విభేదాలతో వీధిన పడిన కాంగ్రెస్ లో మార్పులు జరుగవలసిందే అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మరోసారి తిరుగుబాటు స్వరం వినిపించారు. కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు, సంస్థాగత ఎన్నికలు జరగాల్సిందేనని డిమాండ్ చేశారు.
పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగకుంటే మరో 50 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. అనేక ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైన కమిటీలే లేవని గుర్తు చేశారు. ఎన్నికల ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నియమించాలని స్పష్టం చేశారు.
ఎన్నికలు లేకుండా అధ్యక్షుడిని నియమిస్తే అతనికి పార్టీలో ఒక్కశాతం మంది నుంచి కూడా మద్దతు ఉండదని చెప్పారు. దీనివల్ల ఎవరైనా ఆ పదవిలో దీర్ఘకాలం కొనసాగలేకపోవచ్చని, ఇది అంతర్గతంగా ఎప్పుడూ సమస్యే అవుతుందని వారించారు. అలాకాకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఏ సమస్యా ఉండదని, అధ్యక్ష పదవి నుంచి ఎవరూ తొలగించలేరని చెప్పారు.
More Stories
యుద్ధ రహస్యాలు ఇంట్లో లీక్ చేసిన అమెరికా రక్షణ మంత్రి!
హిందువులకు ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశాన వాటిక
రక్తపు మడుగులో ఇంట్లో శవమై కనిపించిన మాజీ డీజీపీ