పశ్చిమబెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ సర్కారు అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం ప్రారంభించింది. ఇందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ సర్కారు అక్రమాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబరును బీజేపీ ప్రారంభించింది.
తృణమూల్ కాంగ్రెస్ అక్రమాలపై పోరాడేందుకే తాము టోల్ ఫ్రీ నంబరును ప్రారంభించామని పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెప్పారు. తృణమూల్ సర్కారు అవినీతిపై ప్రజలు ఫిర్యాదులు చేస్తే తాము వాటిని పోరాడుతామని దిలీప్ చెప్పారు. తాము ఫిర్యాదుదారుల వివరాలను కేంద్రానికి పంపిస్తామని దిలీప్ తెలిపారు.
ఆంఫన్ తుపాన్ సాయం పంపిణీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని బీజేపీ ఎంపీ ఆరోపించారు. పుర్బామెదినీపూర్, నార్త్ 24 పరగణాస్, సౌద్ 24 పరగణాస్, నాడియా, హౌరా జిల్లాల్లో తుపాన్ సాయం పంపిణీలో అక్రమాలపై బీజేపీ నిరసనలు చేపట్టింది. అక్రమాలకు పాల్పడిన తృణమూల్ కాంగ్రెస్ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
More Stories
అధికారంలోకి వస్తే ఎలక్టోరల్ బాండ్స్ని మళ్లీ తీసుకొస్తాం
తొలి దశలో 62.37 శాతం మాత్రమే పోలింగ్
సైద్ధాంతికంగా కాంగ్రెస్, లెఫ్ట్ దివాలా