సోమవారం హెంతాబాద్ ఏరియా బిందాల్ గ్రామంలోని తన ఇంటికి దగ్గర్లోని ఓ షాపు సీలింగ్ కు రాయ్ ఉరి వేసుకుని కనిపించారు. ఇది ఆత్మహత్యేనని, మృతదేహం నుండి నుంచి ఓ సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని, తన మరణానికి ఇద్దరు వ్యక్తులు కారణమని రాయ్ అందులో రాశారని పోలీసులు తెలిపారు.
దర్యాప్తు ప్రారంభమైందని, ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించిందని, మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపించామని చెప్పారు. అయితే రాయ్ కుటుంబ సభ్యులు మాత్రం ఇది ముమ్మాటికీ హత్యేనని, సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
రాయ్ ని టీఎంసీ గూండాలే చంపేశారని, మంగళవారం 12 గంటల పాటు జిల్లా బంద్ పాటించాలని బీజేపీ పిలుపునిచ్చింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో గూండారాజ్యం నడుస్తోందని, శాంతి భద్రతలు అదుపుతప్పాయని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు.
More Stories
వాయనాడ్ నుంచి కూడా రాహుల్ ను తరిమికొడతారు
అధికారంలోకి వస్తే ఎలక్టోరల్ బాండ్స్ని మళ్లీ తీసుకొస్తాం
తొలి దశలో 62.37 శాతం మాత్రమే పోలింగ్