
చైనాలోని వైద్య విశ్వవిదాలయాల్లో ఎంబీబీఎస్ చదివే విద్యార్ధలకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆ విద్యార్ధులు భారత దేశంలో హౌస్ సర్జన్ చేసేందుకు కేంద్రం నిరాకరించింది. ఆరేళ్ల ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేసిన వారికి మాత్రమే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ రాసే అవకాశాన్ని కల్పిస్తామని స్పష్టం చేసింది.
కేంద్రం హఠాత్తుగా ఈ నిర్ణయం ప్రకటించడంపై విద్యార్దులు, తల్ల్తితండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. చైనాలోని వైద్య విశ్వవిదాలయాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్ధులతోపాటు ఇతర రాష్ట్రాల వారూ ఎంబీబీఎస్ చేస్తున్నారు. ప్రతి ఏడాది నాలుగైదు వేల మంది ఇక్కడ ప్రవేశాలు పొందుతున్నారు.
రష్యా, ఉక్రెయిన్, బల్గెరియా, ఫిలిఫైన్స్, ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ కోర్సు ఆరేళ్లు చదవాల్సి ఉంటుంది. ఆ కోర్సు అనంతరం కేంద్రం నిర్వహించే పరీక్షలో విద్యార్ధులు అర్హత సాధించి ఏడాదిపాటు హౌస్ సర్జన్ భారతదేశంలో చేయాలి.
చైనాలోనూ ఎంబీబీఎస్ ఆరేళ్లు. అయితే ఐదేళ్లు కోర్సు పూర్తి చేసిన తర్వాత చివరి ఏడాది భారత్లో హౌస్ సర్జన్ చేసుకోవడానికి అవకాశం ఉండేంది. భారత ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఇక ఆ అవకాశం లేదు.
More Stories
నన్ను జడ్జ్ చేయడానికి మీకున్న అర్హత ఏమిటి?
మరోసారి ప్రధాని మోదీని ప్రశంసించిన శశిథరూర్
ఉచితాలు, సబ్సిడీలపై సభలో పకడ్బందీ చర్చ జరగాలి