గంగా నది పరిశుభ్రతకు ప్రపంచ బ్యాంకు నిధులు  

గంగా నది పరిశుభ్రతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నమామి గంగే కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమానికి 400 మిలియన్ డాలర్ల ( భారత కరెన్సీలో రూ.2,992 కోట్లు) సహాయాన్ని అందిస్తామని ప్రపంచ బ్యాంక్ తెలిపింది.
రెండవ జాతీయ గంగా రివర్ బేసిన్ ప్రాజెక్ట్ ఈ నదిలో కాలుష్యాన్ని నివారించడానికి, నదీ పరీవాహక ప్రాంతాల నిర్వహణను బలోపేతం చేయడానికి ఒక ప్రకటనలో పేర్కొన్నది. 381 మిలియన్ డాలర్ల రుణం కోసం ఈ ఒప్పందంపై భారత ప్రభుత్వం తరపున ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సమీర్ కుమార్ ఖరే, ప్రపంచ బ్యాంక్ తరపున భారతదేశ యాక్టింగ్ కంట్రీ డైరెక్టర్ కైజర్ ఖాన్ సంతకం చేశారు.
నది పరిశుభ్రత చేపట్టేందుకు నోడల్ ఏజెన్సీగా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాను ఏర్పాటు చేయడంలో సహాయపడిన నేషనల్ గంగా రివర్ బేసిన్ ప్రాజెక్ట్ ద్వారా 2011 నుంచి ప్రపంచ బ్యాంకు ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నది. అలాగే మురుగునీటి శుద్ధి మౌలిక సదుపాయాలకు ఆర్థిక సహాయం చేసింది.
రెండవ జాతీయ గంగా రివర్ బేసిన్ ప్రాజెక్ట్ అందించిన కొనసాగింపుగా మొదటి ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్ట్ క్రింద సాధించిన వేగాన్ని మరింత బలపరుస్తుందని క్లీన్ గంగా నేషనల్ మిషన్ డైరెక్టర్ రాజీవ్ రంజన్ మిశ్రా చెప్పారు. గంగాలో కాలుష్య భారం 80 శాతానికి పైగా నది, దాని ఉపనదుల్లో పట్టణాలు, నగరాల నుంచి శుద్ధి చేయని దేశీయ మురుగునీటి నుంచి వస్తుంది.